Monday, 7 February 2022

ఉపాధ్యాయుల ఆందోళనలపై పోలీసుల ఆరా

 ఉపాధ్యాయుల ఆందోళనలపై పోలీసుల ఆరా



మంత్రుల కమిటీతో పీఆర్సీ సాధన సమితి చేసుకున్న ఒప్పందంపై ఉపాధ్యాయ సంఘాల నుంచి వ్యతిరేకత వ్యక్తమ వుతుండటంతో పోలీసులు రంగంలోకి దిగారు. సోమవారం నుంచి ఉపాధ్యాయులు ఏమైనా ఆందోళన చేస్తారా? అనే కోణంలో ఉపాధ్యాయ సంఘ నాయకులను పోలీసులు స్టేషను పిలిచి మాట్లాడు తున్నారు. కృష్ణా జిల్లా నందిగామలో ఆదివారం ఉపాధ్యాయ నాయకుల నుంచి వివరాలు సేకరిం చారు. యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి మహేశ్వరి వెంకటేశ్వరరావు, నాయకులు లక్ష్మీనారాయణలతో సీఐ కనకరావు మాట్లాడారు. ఆందోళనలపై రాష్ట్ర సంఘం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదని, ప్రస్తు తానికి ఉద్యమ కార్యాచరణ ఏమీ లేదని నాయకులు సీఐకి వెల్లడించారు. నోటీసు తీసుకున్న వారు ఎవరైనా విజయవాడ వెళ్లారా అని ప్రశ్నించారు. దీనిపై ఉపాధ్యాయ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's need

USEFUL APPLICATION FORMS

More

LEAVE RULES

More
Top