అన్ని వనరులతో అత్యుత్తమ బోధన
■ మ్యాపింగ్ ద్వారా ప్రీ ప్రైమరీ నుంచి 12వ తరగతి వరకు విద్యార్థులకు అన్ని వనరులు అందుబాటులోకి రావడంతోపాటు అత్యుత్తమ బోధన అందుతుంది.
■ ఇప్పటివరకు అతీగతీ లేనట్లుగా మిగిలిన అంగన్వాడీ కేంద్రాలు ఫౌండేషన్ విద్యా కేంద్రాలుగా మారనున్నాయి.
■ ఇవి ప్రైమరీ, ప్రీప్రైమరీ పాఠశాలల్లో కలవడం ద్వారా చిన్నారులకు పౌష్టికాహారంతో పాటు ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆటపాటలతో కూడిన బోధన అందుతుంది.
■ ఫౌండేషన్ స్కూళ్లలో ముగ్గురు అంగన్వాడీ వర్కర్లు, సహాయకులతోపాటు ఇద్దరు ఎస్జీటీ టీచర్లను నియమిస్తారు. హైస్కూళ్లలో 3 నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులుంటారు.
■ విద్యార్థుల సంఖ్యను అనుసరించి 10 నుంచి 15 మంది సబ్జెక్టు టీచర్లు ఉంటారు.
■ ఈ స్కూళ్లకు అనుసంధానమయ్యే ప్రైమరీ, యూపీ స్కూళ్లలోని 3, 4, 5 తరగతుల విద్యార్థులకు ఆట స్థలాలు, క్రీడా పరికరాలు, ల్యాబ్లు, గ్రంథాలయాలు, వర్చువల్ డిజిటల్ తరగతి గదులు అందుబాటులోకి వస్తాయి.
■ విద్యార్థులు చిన్నప్పటి నుంచే పెద్ద తరగతుల పిల్లలతో కలిసి ఉండటంవల్ల పై తరగతులకు వెళ్లేకొద్దీ ఆ వాతావరణానికి సులభంగా అలవాటు పడతారు.
■ ప్రస్తుతం ప్రైమరీలో 5వ తరగతి పూర్తి చేసిన విద్యార్థులు హైస్కూలులో 6వ తరగతిలో చేరే సమయంలో ఒకింత బెరుకుగా ఉంటున్నారు. కొన్నిచోట్ల ఇది డ్రాపౌట్లకు దారితీస్తోంది.
■ అంగన్వాడీల నుంచి ప్రైమరీలోకి వచ్చే పిల్లల విషయంలోనూ ఇదే పరిస్థితి తలెత్తుతోంది. మ్యాపింగ్తో ఇలాంటి ఇబ్బందులు దూరం కానున్నాయి.
0 Post a Comment:
Post a Comment