ప్రత్యేక మెనూ అమలుకు చర్యలు
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన శ్రేష్ఠ పథకం ద్వారా ఎస్సీ విద్యార్థులకు ప్రత్యేక మెనూ అమలు చేయాలని సాంఘిక సంక్షేమశాఖ ఉపసంచాలకుడు, ఆ పథకం జిల్లా నోడల్ అధికారి సునీల్ రాజ్కుమార్ ఆదేశించారు. శుక్రవారం స్థానిక కార్యాలయంలో విద్యాశాఖ, బాలయోగి గురుకులాల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో పథకం కింద ఎంపికైన ఒక్కో విద్యార్థికీ ఏటా కేంద్రం రూ.75 వేల నుంచి రూ.1.25 లక్షలు అందజేస్తోందని, ఆ మేరకు వసతులు సమకూర్చాలన్నారు. దీనిపై ప్రతి నెలా ప్రగతి నివేదికలు ఇవ్వాలని సూచించారు. జిల్లా గురుకులాల సమన్వయకర్త బలగ చంద్రావతి, అరుణజ్యోతి, చంద్రమోహన్ తదితరులు పాల్గొన్నారు.
0 Post a Comment:
Post a Comment