కారుణ్య నియామకాలు ఆటోమేటిక్ కాదు : సుప్రీంకోర్టు
ప్రభుత్వ ఉద్యోగి మరణించిన తర్వాత వారిపై ఆధారపడినవా రికి కారుణ్య ప్రాతిపదికన ఉద్యోగాలు కల్పించడమనేది ఆటోమేటిగ్గా జరిగిపోయేది కాదని, వేర్వేరు అంశాలను నిశితంగా పరిశీలించాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కుటుంబ ఆర్థిక పరిస్థితి, కుటుంబంలోని ఇతర సభ్యుల వృత్తి-వ్యాపారాలు, మృతుని సంపాదనపై వారు ఎంతవరకు ఆధారపడ్డారు వంటి అంశాలన్నీ చూడాలని జస్టిస్ హేమంత్ గుప్తా, జస్టిస్ వి. రామసుబ్రమణియన్ల ధర్మాసనం గురు వారం స్పష్టం చేసింది. ఎలాంటి పరిశీలన లేకుండా ఈ ఉద్యోగాలు ఇచ్చేస్తే వాటిని 'చట్టంలో ఉన్న హక్కు'గా భావిస్తారని వ్యాఖ్యానిం చింది. కారుణ్య నియామకాలను ఇలాంటి హక్కుగా ఎవరూ క్లెయిం చేయకూడదని చెప్పింది. ఒక వ్యక్తి కారుణ్య నియామకంపై కర్ణాటక పరిపాలన ట్రైబ్యునల్, అక్కడి హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ ఆ రాష్ట్ర విద్యాశాఖ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అప్పీలుపై ధర్మాసనం తీర్పు వెలువరించింది. హైకోర్టు ఆదేశాన్ని కొట్టివేసింది.
0 comments:
Post a Comment