జనవరి 8, 9 తేదీల్లో చెకుముకి సంబరాలు
జనవరి 8, 9వ తేదీల్లో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి చెకుముకి సంబరాలు నిర్వహిస్తున్నామని ఎమ్మెల్సీ కె.ఎస్.లక్ష్మణరావు వెల్లడించారు. మంగళవారం ఎంబీ విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గుంటూరు నగరం పాటిబండ్ల సీతారామయ్య హైస్కూల్లో ఈ పోటీలు నిర్వహించనున్నట్లు చెప్పారు. నవంబరులో పాఠశాల, మండల, జిల్లా స్థాయి పోటీలు జయప్రదంగా నిర్వహించినట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 4200 పాఠశాలలో ఈ కార్యక్రమం నిర్వహించినట్లు చెప్పారు. 3.80 లక్షల మంది విద్యార్థులు ఆసక్తిగా పాల్గొన్నారని పేర్కొన్నారు. జిల్లాలో విజేతలైన మొత్తం 300మంది విద్యార్థులు రాష్ట్ర స్థాయి సంబరాలకు హాజరుకానున్నారని ఆయన వివరించారు. దీనికి సంబంధించిన గోడపత్రాలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.మురళీధర్, ఏఐపీఎస్ఎన్ జాతీయ ఎగ్జిక్యూటివ్ సభ్యుడు కె.శ్రీనివాస్, జన విజ్ఞాన వేదిక సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
0 Post a Comment:
Post a Comment