ఆదివారమూ పనిచేయాలి - యూడైస్ డేటాను పూర్తిస్థాయిలో నమోదు చేయాలి : ఉపాధ్యాయులకు విద్యాశాఖ ఆదేశం
■ రాష్ట్రంలో అన్ని యాజమాన్యాల ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు ఆదివారం పని చేయాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్. సురేష్ కుమార్ ఉత్తర్వులు విడుదల చేశారు.2021-22 విద్యా సంవత్సరానికి సంబంధించిన విద్యార్థుల సమాచారాన్ని (యూడైస్ ప్లస్) డేటాను పూర్తి స్థాయిలో నమోదు చేసేందుకు ఆదివారం సిబ్బంది అందరూ పని చేయాలని స్పష్టం చేశారు.
■ 2019-20, 2020-21 విద్యా సంవత్సరాల్లో యూడైస్ డేటా పూర్తి స్థాయిలో సమగ్రంగా నమోదు చేయకపోవడం వల్ల నీతి ఆయోగ్ ర్యాంకింగ్, పీజీఐ, ఎసీజీ ఇండికేటర్లలో రాష్ట్ర ర్యాంకు పడిపోయిందని వివరించారు.
■ గత రెండేళ్లుగా కరోనా కారణంగా పూర్తిస్థాయిలో విద్యాసంస్థలు నడవకపోవడం కూడా ఒక కారణమే.
■ ఈ నేపథ్యంలో 2021-22 సంవత్సరానికి సంబంధించి డేటాను సమగ్రంగా నమోదు చేసేందుకు సిబ్బంది అందరూ ఆదివారం పని చేయాలని ఆదేశించారు.
0 Post a Comment:
Post a Comment