పదవ తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణకు సంబంధించి వీడియో కాన్ఫరెన్స్ నందు కమిషనర్ పాఠశాల విద్య వారి ఆదేశాలు
✍️ ప్రశ్నపత్రంపై విద్యార్థి చేత పేపర్ ఇచ్చిన వెంటనే తప్పనిసరిగా హాల్ టికెట్ నెంబర్ పూర్తిగా వేయించాలి.
✍️ పరీక్ష నిర్వహణలో భాగంగా పరీక్ష కేంద్రంలో నాన్ టీచింగ్ స్టాఫ్, ప్రైవేటు పాఠశాలల సిబ్బంది లేదా సి.ఆర్.పిల సేవలు వినియోగించుకుంటూ ఉంటే వారిని తక్షణం రిలీవ్ చేయాలి. సి.ఆర్.పిలు పరీక్షా కేంద్రం లో ఉండకూడదు.
✍️ వాటర్ బాయ్ గా లేదా జవాబు పత్రాలు బండిల్స్ కుట్టడానికి ఎవరినైనా వినియోగించుకుంటుంటే వారిని తక్షణం రిలీవ్ చేయాలి.
✍️ వాటర్ బాయ్ పరీక్ష ప్రారంభానికి ముందే వాటర్ పోసి బయటికి వెళ్లి పోవాలి. పరీక్ష జరిగే సమయంలో వాటర్ బాయ్ పరీక్షా కేంద్రంలో ఉండడానికి వీల్లేదు
✍️ 8వ మరియు 9వ తరగతి విద్యార్థులను వాటర్ బయటగా వినియోగించుకుంటూ ఉంటారు. వారిని వాటర్ బాయ్ గా వినియోగించుకో కూడదు
✍️ పరీక్షా కేంద్రాలలో కొంతమంది విద్యార్థులు డిజిటల్ వాచ్ లు పెట్టుకుని వస్తున్నట్లు సమాచారం ఉంది వాటికి అనుమతి లేదు
✍️ ఇన్విజిలేటర్లు, డిపార్ట్మెంట్ ఆఫీసర్ లు ఎవరైనా.. పరీక్షా కేంద్రానికి సెల్ ఫోన్ తీసుకెళ్లకూడదు. ఎవరైనా సెల్ ఫోన్ తీసుకెళ్లి నట్లయితే సస్పెండ్ చేయమని కమీషనర్ గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది.
✍️ పరీక్ష హాలు లో ఇన్విజిలేటర్ ఎవరి దగ్గరైనా సెల్ ఫోన్ ఉన్నట్లయితే ఎటువంటి తదుపరి విచారణ లేకుండా సస్పెండ్ చేయడం జరుగుతుంది
✍️ పరీక్షా కేంద్రంలో మాల్ ప్రాక్టీస్ కేసులు ఎవైనా బుక్ అయినట్లయితే యాక్ట్ 25 ప్రకారం చర్యలు తీసుకోబడతాయి.
0 Post a Comment:
Post a Comment