సచివాలయాల ఉద్యోగుల హాజరుకు ముఖ గుర్తింపు యాప్ - 16 నుంచి ప్రయోగాత్మకంగా అమలు
రాష్ట్రంలోని గుంటూరు | జిల్లా తాడేపల్లి పట్టణ, విశాఖ జిల్లా పాడేరు మండల పరిధిలోని గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగులు, వాలంటీర్ల హాజరుకు ముఖ ఆధారిత గుర్తింపు యాప్ను ఈనెల 16 నుంచి ప్రయోగాత్మకంగా అమలుచేయనున్నారు. ఇక్కడ విజయవంతమైతే మరికొన్ని చోట్ల దీన్ని ప్రవేశ పెట్టాలని అధికారులు యోచిస్తున్నారు. తదుపరి ఆదేశాలు వెలువడే వరకు ప్రస్తుతం అమలులో ఉన్న బయోమెట్రిక్తో పాటు ఈ యాపు లు వాడాలని గ్రామ, వార్డు సచివాలయాలశాఖ ఆ రెండు జిల్లాల సంయుక్త కలెక్టర్లను ఆదేశించింది. గ్రామ, వార్డు సచివాలయాల్లో 4.2 లక్షల మంది ఉద్యోగులు, వాలంటీర్లు పని చేస్తున్నారు. కొవిడ్తో పాటు అంతర్జాల సమస్యతో ప్రస్తుతం చాలాచోట్ల బయోమెట్రిక్ విధానం సరిగా అమలు కావడం లేదు. దీంతో రాష్ట్ర సచివాలయంలోని మొదటి బ్లాకులో తాజాగా ప్రవేశ పెట్టిన ముఖ గుర్తింపు యాప్ను గ్రామ, వార్డు సచివాలయాల్లోనూ అమలు చేయాలని ప్రభుత్వ అధికారులును ప్రధాన కార్యదర్శి ఆదేశించారు.
0 Post a Comment:
Post a Comment