పండగ పూట బ్యాంకు ఉద్యోగులకు విధులా ? : యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంకు యూనియన్స్ కన్వీనర్ రాంబాబు
ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ రంగ బ్యాంకుల సిబ్బంది సంక్రాంతి రోజు శనివారం విధుల్లో ఉండాల్సి రావడం బాధాకరమని యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ కన్వీనర్ బి.ఎస్.రాంబాబు తెలిపారు. రాష్ట్రంలో అందరూ వారి కుటుంబాలతో ఆనందంగా పండుగ నిర్వహించుకుంటున్నారన్నారు. అదే సమయంలో బ్యాంకు ఉద్యోగులు మాత్రం కార్యాలయాల్లో పనిచేయాలనే నిర్ణయం 50 వేల మందికి పైగా కుటుంబాలను బాధిస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా మూడు రోజులు సెలవులు ప్రకటించి.. బ్యాంకు ఉద్యోగులకు మాత్రం పండుగ రోజు పని చేయాలన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం కూడా సెలవు ఇవ్వాలంటూ తాము విజ్ఞప్తి చేసినా పరిగణనలోకి తీసుకోలేదన్నారు.
0 Post a Comment:
Post a Comment