ఉత్తర్వులు రద్దు చేస్తేనే వేతనాల బిల్లుల ప్రాసెస్
పీఆర్సీ అమలు ఉత్తర్వు లను రద్దుచేస్తేనే ఈ నెల వేతనాల బిల్లులను ప్రాసెస్ చేస్తామని, లేని పక్షంలో బిల్లులు. ప్రాసెస్ చేయబోమని ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శికి ఏపీ ట్రెజరీ సర్వీసెస్ అసోసియే షన్ లేఖ రాసింది. పీఆర్సీతో సంబంధం లేని మిగిలిన అన్ని బిల్లులను అనుమతించడంతో పాటు, ప్రాసెస్ చేస్తామని తెలిపింది. 11వ పీఆర్సీ అమలుపై ఉద్యోగులు, ఉపాధ్యాయు లు, పెన్షనర్ల ఆందోళనలకు మద్దతు తెలుపు | తున్నట్టు పేర్కొంది. జేఏసీ, జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ ట్రెజరీ ఉద్యోగులు కూడా సభ్యులే నని తెలిపింది. కొత్త పీఆర్సీ బిల్లులను అను మతించబోమని, అదేవిధంగా డీడీవోల నుంచి వచ్చే పీఆర్సీ బిల్లులను ప్రాసెస్ చేయ బోమని పేర్కొంది. అందరు ప్రభుత్వ ఉద్యో గత పీఆర్సీ 27 శాతం ఐఆర్ కొనసా గింపునకు సుముఖంగా ఉన్నారని తెలిపింది. కొత్త పీఆర్సీ ఉత్తర్వుల ప్రకారం బిల్లులు ప్రాసెస్ చేయాలని తమపై ఒత్తిడి తీసుకు రావద్దని విజ్ఞప్తి చేసింది.
0 Post a Comment:
Post a Comment