Tuesday 18 January 2022

నాణ్యమైన విద్యకు ఎంతైనా వెచ్చిస్తాం : పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక కార్యదర్శి బి. రాజశేఖర్

 నాణ్యమైన విద్యకు ఎంతైనా వెచ్చిస్తాం : పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక కార్యదర్శి బి. రాజశేఖర్



నాణ్యమైన విద్య కోసం ప్రభుత్వం ఎంత వెచ్చించడానికైనా సిద్ధంగా ఉందని పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక కార్యదర్శి బి. రాజశేఖర్ పేర్కొన్నారు. పాఠశాలల మ్యాపింగ్, నూతన జాతీయ విద్యా విధానం అమలుపై గుంటూరులో మంగళవారం నిర్వహించిన పాఠశాల విద్యాశాఖ రాష్ట్ర స్థాయి సమావే శంలో ఆయన కీలకోపన్యాసం చేశారు. ఏపీలో అమలు చేస్తున్న కొన్ని పథకాలను తెలంగాణ ప్రభుత్వం అమలు చేయడానికి క్యాబినెట్ లో నిర్ణయించడం శుభప రిణామమన్నారు. 'పాఠశాలల విలీనం ప్రక్రియను వ్యతి రేకిస్తూ కొందరు విమర్శిస్తున్నారు. వారు తాము తొలుత ప్రభుత్వ ఉద్యోగులం అనే విషయాన్ని మరవ కూడదు. ఇక మీదట ఇలాంటివి సాగబోవు...' అని స్పష్టం చేశారు. ఏదైనా అభ్యంతరాలు ఉంటే వాటిని ప్రభుత్వం దృష్టికి తేవడానికి ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు ఉన్నారని గుర్తు చేశారు. విలీనంతో పిల్లలు పెరిగి అద నపు గదులు, కొత్త టీచర్ల నియామకాల అవసరం ఏర్ప డినా వాటిని పరిష్కరించడానికి సీఎం జగన్ సానుకూలంగా ఉన్నారని చెప్పారు. అలాగే పాఠశాలలు దూర మైతే పిల్లలకు రవాణా వసతి కల్పించడానికి సమగ్ర శిక్షలో అనేక పథకాలు ఉన్నాయన్నారు. కమిషనర్ సురేష్ కుమార్ మాట్లాడుతూ ఈ నెల 21 నాటికి ఈ ప్రక్రియను ముగించాలన్నారు. డీఈఓలు, ఆర్జేడీలు, అడిషనల్ డైరెక్టర్లు, డీవైఈఓలు, ఏడీలు, ఎంఈఓలు, హెచ్ఎంలు, తదితరులు పాల్గొన్నారు.

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top