Thursday 13 January 2022

ఏపీ ఉద్యోగులకు జగన్ సర్కార్ మరో షాక్

 ఏపీ ఉద్యోగులకు జగన్ సర్కార్ మరో షాక్



ఏపీ ఉద్యోగులకు జగన్ సర్కార్ మరో షాక్ ఇచ్చేలా కనిపిస్తోంది. హెచ్ఆర్ఏ వ్యవహారం పై ఇప్పటి వరకు పీటముడి వీడలేదు. ఇప్పటికే రెండు దఫాలుగా ప్రభుత్వంతో చర్చలు జరిపారు జేఏసీల ఐక్య వేదిక ప్రతినిధులు. ఈ నేపథ్యంలోనే మరోసారి సీఎంఓ అధికారులతో సమావేశం అయ్యారు ఉద్యోగ సంఘాల నేతలు సీఎస్‌ కమిటీ సిఫార్సులను అమలు చేస్తామని చెబుతోంది జగన్ మోహన్ ప్రభుత్వం. అయితే సీఎస్ కమిటీ సిఫార్సులు అమలు చేస్తే అమరావతి పరిధిలో పని చేస్తున్న ఉద్యోగుల హెచ్ఆర్ఏ 30 శాతం నుంచి 8 శాతానికి పడిపోయే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది. ప్రస్తుతమున్న విధానాన్నే కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నాయి ఉద్యోగ సంఘాలు. ఈ మధ్యాహ్నానికి హెచ్చార్‌ఏ పై క్లారిటీ ఇస్తామని చెప్పారు సీఎంఓ అధికారులు. హెచ్చార్‌ఏ పై క్లారిటీ రాకుంటే కార్యాచరణ రూపకల్పన పై సమావేశమవ్వాలని భావిస్తున్నారు ఉద్యోగ సంఘాల నేతలు.ప్రభుత్వం ప్రకటించిన 23 శాతం తమకు సమ్మతం కాదని ఇప్పటికే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది ప్రభుత్వ ఉద్యోగుల సంఘం. అయితే దీనిపై ఇవాళ సాయంత్రం క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top