78 మంది ఉపాధ్యాయులకు కరోనా పాజిటివ్
గొల్లప్రోలు(తూర్పు గోదావరి) జిల్లాలో గత ఐదు రోజుల్లో (శుక్రవారం సాయంత్రం వరకు) వివిధ ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 78 మంది ఉపాధ్యాయులు, 28 మంది విద్యార్థులు కొవిడ్ బారిన పడ్డారని డీఈవో ఎస్.అబ్రహం తెలిపారు. స్థానిక జడ్పీ బాలికోన్నత పాఠశాల, తాటిపర్తి ఉన్నత పాఠశాలను ఆయన శనివారం తనిఖీ చేశారు. జడ్పీటీసీ సభ్యుడు నాగలోవరాజుతో కలిసి మధ్యాహ్న భోజన పదార్థాలను పరిశీలించారు. అన్నం ముద్దగా, సాంబారు పలుచగా ఉందని పేర్కొన్నారు. కరోనా వ్యాప్తి భయంతో పాఠశాలల్లో విద్యార్థుల హాజరు రెండ్రోజులుగా 20 శాతానికిపైగా తగ్గిందని డీఈవో తెలిపారు. 2020లో ఆర్ఎంఎస్ఏలో మంజూరైన తరగతి గదుల భవన పనులు త్వరలో ప్రారంభమవుతాయని చెప్పారు. జిల్లాలో 115 పాఠశాలలకు సొంత భవనాలు లేవని, ఇతర చోట్లా విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా భవనాల నిర్మాణానికి నిధుల మంజూరుకు ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు.
0 Post a Comment:
Post a Comment