రోబో టీచర్ - దేశంలోనే టీచింగ్ రోబో ‘ఈగిల్’ను అభివృద్ధి చేసిన ఇండస్ స్కూల్
ప్రభుత్వ బడుల్లో వినియోగించే అవకాశాలను పరిశీలిస్తాం: సబిత
పనితీరును ఆదివారం మంత్రి సబితా ఇంద్రారెడ్డి ముం దు నిర్వాహకులు ప్రదర్శించారు. రోబో టీచర్ పనితీరును గమనించిన మంత్రి సబిత ప్రభుత్వ పాఠశాలల్లో వాటిని నియమించేందుకు గల అవకాశాలను పరిశీలిస్తామన్నారు. కాగా.. సామాజిక, ఆర్థిక అంతరాలను తగ్గించడంలో విద్య కీ లక పాత్ర పోషిస్తుందని ఇండస్ ఇంటర్నేషనల్ స్కూల్ సీఈవో లెఫ్టినెంట్ జనరల్ అర్జున్ రే (రిటైర్డ్) అన్నారు. హై దరాబాద్, బెంగళూరు, పుణెలోని ఇండస్ స్కూళ్లలో 21 ఈగిల్స్ను అందుబాటులోకి తెచ్చామని ఆయన వివరించారు. టీచర్లకు శిక్షణ అందించే టీచర్ ట్రైనింగ్ రోబో ప్యాకేజీలు కూడా ఉన్నాయని తెలిపారు. బోధనలో టీచర్లకు సహాయకారిగా ఉండే ఈ రోబోలను ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో అందుబాటులోకి తెస్తున్నామన్నారు. కర్ణాటకలో 30 రోబోల ను అందించామని, ఆయా స్కూళ్లలో ఉపాధ్యాయుల కొరత తీరడంతోపాటు విద్యలో నాణ్యత పెరిగిందని తెలిపారు.
0 Post a Comment:
Post a Comment