బోధనేతర విధుల్లో 900 మంది ఉపాధ్యాయులు
ఉపాధ్యాయులను బోధనేతర పనులకు వినియోగించకూడదనే నిబంధన ఉన్నా అదికారులు దీనిపై దృష్టి సారించడం లేదు. విద్యార్థులకు పాఠాలు బోధించేవారు లేకపోయినా డిప్యుటేషన్లను రద్దు చేయడం లేదు. అనంతపురం జిల్లాలో కొందరు ఉపాధ్యాయులు ప్రజాప్రతినిధుల వద్ద పీఏలుగా పని చేస్తున్నారు. మరికొన్ని జిల్లాల్లో డిప్యుటేషన్లపై పంచా యతీరాజ్, జైళ్ల విభాగాల్లోనూ విధులు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 900 మంది ఉపాధ్యాయులు బోధనేతర విధుల్లో ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. పురపాలకశాఖలోనూ డిప్యుటేషన్లపై పని చేస్తున్నవారు అధికంగానే ఉన్నారు. పురపాలక పాఠశాలల్లో విద్యార్థులకు ఇచ్చే ఐఐటీ కోచింగ్ పర్యవేక్షణ, ఇతర కార్యకలాపాలకు గతంలో ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత దీన్ని రద్దు చేసినా ఇప్ప టికీ పుర, నగరపాలక సంస్థల్లో ఉపాధ్యాయులను పర్యవేక్షకుల పేరుతో బోధనేతర పనులకు వినియోగిస్తున్నారు. పురపాలక సంఘాల్లో నలుగురు, నగరపాలక సంస్థల్లో 6-8 చొప్పున ఉపాధ్యాయులు బోధనేతర విధులు నిర్వర్తిస్తున్నారు. పురపాలక డైరెక్టర్ కార్యాల యంలో 12 మంది వరకు ఉన్నారు. జిల్లా విద్యాధికారి కార్యాలయం, సమగ్రశిక్ష అభియాన్ కార్యాలయాల్లో వివిధ హోదాల్లో స్కూల్ అసిస్టెంట్లు, ఎస్జీటీ, ప్రధానోపాధ్యాయులు పని చేస్తున్నారు. వీరందరూ బోధన విధులకు దూరంగా ఉంటున్నారు. ఇటీవల "నాడు-నేడు పర్య వేక్షణకంటూ డివిజను ఇద్దరు, ముగ్గురు ఉపాధ్యాయు లను డిప్యుటేషన్ పై తీసుకున్నారు. ఒకవైపు సబ్జెక్టు ఉపా ధ్యాయుల కొరత కారణంగా ఉన్నత పాఠశాలల్లో విద్యా ర్థులు ఇబ్బందులు పడుతుండగా మరోవైపు స్కూల్ అసి స్టెంట్లను బోధనేతర పనులకు వినియోగిస్తున్నారు.
0 Post a Comment:
Post a Comment