ఏడాదిలో రాష్ట్రంలోని 481 పాఠశాలల మూత
● అత్యధికం ప్రైవేటు, ఎయిడెడ్ బడులే
● ప్రభుత్వ స్కూళ్లలో పెరిగిన5.84 లక్షల మంది విద్యార్థులు
ఆంధ్రప్రదేశ్ లో ఏడాది కాలంలో 481 స్కూళ్లు మూతపడ్డాయి. వీటిలో ప్రైవేటు స్కూళ్లు 381 ప్రభుత్వ ఎయిడెడ్ 113, ఇతర స్కూళ్లు 17 ఉన్నాయి. ప్రభుత్వ బడులు మాత్రం 30 పెరిగాయి. కరోనా కారణంగా పాఠశాలలు నడవక, తల్లిదండ్రుల ఆదాయాలు పడిపోయి పీజులు కట్టలేని పరిస్థితి తలె త్తడంతో ఆ ప్రభావం అత్యధికంగా ప్రైవేటు, ఎయిడెడ్, ఇతర స్కూళ్లపై పడింది. ఫలితంగా అవి ఎక్కువ సంఖ్యలో కనుమరుగయ్యాయి. కేంద్ర విద్యాశాఖ తాజాగా విడుదల చేసిన యూడీఐఎస్ఈ నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. 2019-20 నుంచి 2020-21 మధ్యకాలంలో ఒడిశా (-2,835), రాజస్థాన్ (-1,138), అసోం (-704), పశ్చిమబెంగాల్ (-602) తర్వాత అత్య ధిక స్కూళ్లు మూతపడింది ఏపీలోనే, తర్వాతి. స్థానాల్లో కర్ణాటక (-261), కేరళ (-185) ఉన్నాయి. తమిళనాడు (+7), తెలంగాణ ( 4342)లో పెరిగాయి. 2019-20తో పోలిస్తే 2020-21లో ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య 5.84 లక్షల మేర పెరి గింది. ప్రైవేటు పాఠశాలల్లో 5,02 లక్షల మేర తగ్గింది. ఏపీలో ప్రభుత్వ బడుల్లో విద్యార్థులు భారీగా పెరిగినప్పటికీ టీచర్ల సంఖ్య 1,638 మాత్రమే పెరిగింది.
0 Post a Comment:
Post a Comment