Memo.No.ESE02-27021/12/2022-MDM-CSE Dated: 25-02-2022
Jagananna Gorumudda -Instructions on receiving of PM POSHAN / Jagananna Gorumudda rice from Fair Price Shops(FP Shops)-Issued -Regarding.
వివరణ :
★ మధ్యాహ్న భోజన పథకం కోసం బియ్యాన్ని ప్రధానోపాధ్యాయులు/ ఏజెన్సీ వారు వేలి ముద్ర వేసి మాత్రమే తీసుకోవాలని తాజాగా ఆదేశాలు జారీ.
★ బియ్యం తీసుకునే విషయంలో ఇదివరకే స్పష్టమైన ఆదేశాలు జారీ చేసి ఉన్నందువలన ఎవరు మాన్యువల్ గా బియ్యం తీసుకోకూడదని సూచించారు.
★ పౌర సరఫరాల శాఖ వారు బియ్యాన్ని మ్యాన్యువల్ గా తీసుకోవడం వలన బియ్యం లెక్కలు సరిపోకపోవడం మరియు అక్రమాలు జరిగే అవకాశం ఉంది.
★ విద్యాశాఖ అధికారులు అందరూ కూడా ఈ విషయాన్ని ప్రధానోపాధ్యాయులకు తెలియపరచ వలసిందిగా ఆదేశించారు.
గమనించవలసిన అంశాలు :
★ ప్రతి నెల పాఠశాలకు కావలసిన బియ్యం వివరాలను ఐ ఎం ఎం ఎస్ యాప్ లో 15వ తేదీ నుండి 20వ తేదీ మధ్యలో నమోదు చేయవలెను.
★ ప్రధానోపాధ్యాయులు అందరూ విధిగా వేలి ముద్ర వేసి ప్రతి నెలా 1వ తేదీ నుండి 15వ తేదీ లోపు బియ్యం ను తీసుకోవాలి.
★ చౌక ధరల దుకాణం వివరాలు మార్చుకోవాలి అనుకుంటే, బియ్యం తీసుకున్న తర్వాత ప్రతి నెలా 20వ తేదీన మార్పులు చేసుకోవచ్చు.
★ ఈ ఆదేశాలను పాటిస్తూ ప్రతి నెలా బియ్యం తీసుకోవాలని, ఈ ఆదేశాలు పాటించని పక్షంలో ప్రధానోపాధ్యాయులను భాధ్యులు చేస్తూ చాలా తీవ్రమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
0 Post a Comment:
Post a Comment