పీఆర్సీ లెక్కింపునకు మార్గదర్శకాలు - ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ
ప్రభుత్వ ఉద్యో గుల పీఆర్సీ లెక్కింపు ప్రక్రియను ప్రారంభించేందుకు ఆర్థిక శాఖ మార్గదర్శకాలను జారీ చేసింది. పీఆర్సీని ఎలా లెక్కిం చాలన్న విషయాలను మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. ప్రస్తుతం అమల్లో ఉన్న బేసిక్ పేతో 1-7-2018 డీప 30.392%, 23% ఫిట్మెంట్ కలిపి రివైజ్డ్ బేసిక్ పే లెక్కిం చాలని సూచించారు. 2015 పీఆర్సీ బేసిక్ పేతో 1.53392 హెచ్చిస్తే కొత్త రివైజ్డ్ పేస్కేల్ వస్తుందని తెలిపారు. అదేవి ధంగా 2015లో ఆగిన ఇంక్రిమెంట్లను, హెచ్ఎస్ఏ, సీసీఏ తదితర ప్రయోజనాలను ఎలా లెక్కించాలన్న విషయాన్ని కూడా మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. 1-7-2018 నుంచి రివైజ్డ్ పీస్కేల్ అమలు చేయాలని, మానిటరీ బెనిఫిట్స్ 1-4-2020 నుంచి అందించాలని వివరించారు. జనవరి 2022 నుంచి రివైజ్డ్ పేస్కేల్ ప్రకారం జీతాలు చెల్లించనున్నట్లు తెలిపారు. పెండింగ్లో ఉన్న 5 డీఏలను జనవరి జీతాలతో పాటు ఫిబ్ర వరి నుంచి చెల్లించాలని ఆర్థిక శాఖ సూచించింది.
0 Post a Comment:
Post a Comment