సమ్మెలో మేమూ పాల్గొంటాం - ప్రజారోగ్య వైద్య ఉద్యోగుల సంఘం
ఉద్యోగుల ఆకాంక్షలను పట్టించుకోని ప్రభుత్వ ఉదాసీన వైఖరికి వ్యతిరేకంగా తాము కూడా సమ్మెలో పాల్గొంటామని ప్రజారోగ్య వైద్య ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జి.ఆస్కారరావు ప్రకటించారు. ‘‘కార్మిక చట్టాల ప్రకారం ప్రత్యేకంగా సమ్మె నోటీసును ప్రభుత్వానికి అందజేస్తాం. అవసరమైతే వైద్య సేవలను సైతం నిలిపివేయడానికి వెనకాడబోం. సీపీఎస్ రద్దు, ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణ, గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగుల క్రమబద్ధీకరణలో నిర్లిప్తత ప్రదర్శించడం సరికాదు. తక్షణమే 30% తగ్గకుండా ఫిట్మెంట్ ప్రకటించాలి. హెచ్ఆర్ఏ శ్లాబులను యథాతథంగా అమలు చేయటంతోపాటు ఒప్పంద ఉద్యోగులను రెగ్యులైజ్ చేయాలి’ అని స్పష్టంచేశారు.
0 Post a Comment:
Post a Comment