వద్దన్నా వేతనాల ప్రక్రియ - 20 కి పైగా మున్సిపాలిటీల్లో జీతాల ఆమోదం
వేతనాల్లో కోత వద్దంటూ లక్షల మంది ఉద్యోగులు ప్రభుత్వ ఒత్తిడి తట్టుకుంటూ రోడ్లపైకెక్కి ఆందోళన చేస్తున్నారు. అయినా.. మున్సిపల్ కమిషనర్లు, ఆ కార్యాలయాల సిబ్బంది మంగళవారం వేతనాల ప్రక్రియను కొనసాగించారు. వార్డు సచివాలయాల ఉద్యోగులకు సంబంధించిన జీతాల బిల్లులు ప్రాసెస్ చేశారు. గుంటూరు, కృష్ణా, అనంతపురం, చిత్తూరు, కర్నూలు ఇంకా మరికొన్ని జిల్లాల్లోని మున్సిపల్ కమిషనర్లు ఈ ప్రక్రియను నడిపించారు. అయితే, గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు ప్రొబేషన్ డిక్లేర్ అయిన తర్వాతే జీతాలు పెరుగుతాయి. కాబట్టి, ఆ ఉద్యోగులకు జనవరి నెల జీతాల్లో మార్పు ఉండదు. పాత జీతాలే వస్తాయి. అయినప్పటికీ అందరి ఉద్యోగులతో పాటు సమ్మెలో ఉన్న వారి జీతాలను ప్రాసెస్ చేయడం చర్చనీయాంశమైంది. ప్రభుత్వోద్యోగుల జీతాల ప్రక్రియలో పాల్గొనబోమని రాష్ట్రవ్యాప్తంగా ట్రెజరీ ఉద్యోగులు ఇప్పటికే స్పష్టంచేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే 10కి పైగా మున్సిపల్ కార్యాలయాల నుంచి వచ్చిన బిల్లులు ఆ యా ట్రెజరీల వద్ద పెండింగ్లో ఉన్నాయని ట్రెజరీ అధికారులు చెప్పారు.
ఒకవేళ ట్రెజరీ అధికారులు ప్రాసెస్ చేయకపోయినా సరే ప్రభుత్వమే సీఎ్ఫఎంఎస్ వ్యవస్థను ఉపయోగించి ట్రెజరీ వ్యవస్థను బైపాస్ చేసి నేరుగా ఆ వేతనాల బిల్లులను ప్రాసెస్ చేసి జీతాలు చెల్లించగలదు. సీఎ్ఫఎంఎ్సలో ఈ వెసులుబాటు ఉండడంతో ట్రెజరీ కార్యాలయాల వద్ద రెండు మూడు రోజులు పెండింగ్లో ఉన్న తర్వాత ప్రభుత్వం సీఎ్ఫఎంఎ్సను రంగంలోకి దించి నేరుగా ఆ వేతనాల బిల్లులను ప్రాసెస్ చేయాలని భావిస్తున్నట్టు సమాచారం. జగన్ అధికారంలోకి వచ్చిన కొత్తల్లో రాష్ట్రవ్యాప్తంగా ట్రెజరీ ఉద్యోగులంతా సమ్మెకి దిగారు. వేతనాల స్కేళ్లు సవరించాలని డిమాండ్ చేశారు. ఆ సమయంలో కూడా ట్రెజరీ వ్యవస్థతో పనిలేకుండా నేరుగా సీఎ్ఫఎంఎస్ ద్వారా ప్రభుత్వం.... ఉద్యోగులందరి వేతనాలు ప్రాసెస్ చేసి ఆ మేరకు చెల్లింపులు చేసింది. అందుకే అప్పుడు ఉద్యోగులకు రెండు నెలల జీతాలు ఒకేసారి పడడం, చనిపోయిన వారికి పెన్షన్లు పడడం లాంటి తప్పులు జరిగాయి. అలా అదనంగా పడిన జీతాలను తర్వాత ట్రెజరీ అధికారులే రికవరీ చేయాల్సి వచ్చింది.
0 Post a Comment:
Post a Comment