కోవిడ్ యాంటీబాడీ కాక్టెయిల్ వచ్చేసింది
కోవిడ్ బారిన పడిన వ్యక్తుల్లో రోగ నిరోధక శక్తిని పెంచి వ్యాధి ముదరకుండా చేసే యాంటీబాటీ కాక్టెయిల్ ఔషధాలు త్వరలో ఇండియాలో అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే అమెరికా, యూరోపియన్ యూనియన్ దేశాల్లో ఈ ఔషధాన్ని ఉపయోగిస్తుండగా తాజాగా ఇండియాలోను అనుమతులు వచ్చాయి. ఇటీవల ఈ యాంటిబాడీ కాక్టెయిల్కి సెంట్రల్ డ్రగ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ అనుమతి ఇచ్చింది. ఈ యాంటీబాడీ కాక్టెయిల్ ఒక డోసులో 600 మిల్లీ గ్రాముల కాసిరివిమాబ్, 600 మిల్లీ గ్రాముల ఇమ్డెవిమాబ్ మెడిసన్స్ ఉంటాయి.
యాంటిబాటీ కాక్టెయిల్ కిట్ మందులు 12 ఏళ్ల పైబడి 40 కిలోల మించి బరువు ఉన్నవారు మాత్రమే వాడాలి. అదే విధంగా మందులు ఉపయోగించే సమయానికి రోగిలలో ఆక్సిజన్ లెవల్స్ 90 శాతానికి పైగా ఉండాలని యాంటీబాడీస్ కాక్టెయిల్ను అందిస్తోన్న రోచే ఫార్మసీ సంస్థ సూచిస్తోంది. ఈ కిట్ ఉపయోగించిన వారిలో 70 శాతంత మంది నాలుగు రోజుల్లో కోలుకున్నారని ఆ సంస్థ చెబుతోంది. రోచే సంస్థ రూపొందించిన ఈ ఔషధాలను సిప్లా సంస్థ ఇండియాలో పంపిణీ చేస్తోంది.12 ఏళ్లుపై బడిన వారికే:యాంటీబాడీ కాక్టైల్ ఇండియాలో సానుకూల ఫలితాలు ఇస్తుందనే నమ్మకం ఉందంటోంది రోచే ఫార్మసీ సంస్థ. రోగిలో వ్యాధి ముదరకుండా తమ ఔషధం అడ్డుకుంటుందన్నారు. అంతేకాదు ఆస్పత్రికి వెళ్లకుండా ఇంట్లోనే రోగు కోలుకునే అవకాశం మెరుగవుతుందన్నారు. కోవిడ్ చికిత్సలో భాగంగా ఒక్కో పేషెంట్ ఒక డోసు మందులు వాడాల్సి ఉంటుంది. ఒక్కో డోస్ ఖరీదును రూ 59,750 రూపాయలుగా నిర్ణయించారు. ఇద్దరు రోగులకు సరిపడా ఔషధాలు ఉన్న కిట్ని రూ.1,19,500లకి అందిస్తున్నారు.
0 Post a Comment:
Post a Comment