ఏపీలో షెడ్యూల్ ప్రకారమే టెన్త్, ఇంటర్ పరీక్షలు. _ మంత్రి ఆదిమూలపు సురేష్.
★ ఏపీలో షెడ్యూల్ ప్రకారమే టెన్త్, ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తామని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు.
★ సీబీఎస్ఈ పరీక్షలు రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకోవటంతో రాష్ట్రంలో పరిస్థితిపై ఆయన ఆరా తీశారు.
★ అన్ని పాఠశాలల్లో కోవిడ్ ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పారు.
★ విద్యార్థులకు కోవిడ్ పరీక్షలు నిర్వహిస్తూ ప్రతిరోజూ పరిస్థితిని సమీక్షిస్తున్నామన్నారు.
★ మున్ముందు కోవిడ్ కేసులు పెరిగితే అప్పుడు పరీక్షల నిర్వహణపై ఆలోచిస్తామని చెప్పారు.
★ కోవిడ్ నిబంధనలు పాటించని విద్యా సంస్థలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
★ ముఖ్యమంత్రి జగన్తో సమీక్ష జరిపి పరీక్షల నిర్వహణపై చర్చిస్తామన్నారు.
★ ఇప్పటికయితే యథావిథిగా షెడ్యూల్ ప్రకారమే అన్ని పరీక్షలు జరిపే ఆలోచనలో ఉన్నామని ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు.
★ ఒక వేళ కోవిడ్ కేసులు పెరిగితే అప్పుడు ఆలోచిస్తాం – కోవిడ్ నిబంధనలు పాటించని విద్యా సంస్థలపై చర్యలు తీసుకుంటాం – రేపటి జగన్ సమీక్షలోనూ పరీక్షలపై చర్చిస్తాం.
_ మంత్రి ఆదిమూలపు సురేష్.
Haa
ReplyDeleteThankful
Your teachers