కడుపు నిండా తిండి,కంటి నిండా నిద్ర-కాయకష్టం ఇదే కరోనా కట్టడికి దివ్యౌషధం
🛑 శారీరీక శ్రమ వ్యాయామం లేని వారే కరోనాతో బలి
🔹 మీరు రెగ్యులర్గా వ్యాయామం చేస్తున్నారా.
🔹 రెండేళ్ల నుంచి వ్యాయామం అసలే అలవాటు లేనివాళ్లను కోవిడ్ బలి తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
🔹 కదలికలేని జీవితాన్ని గడుపుతున్నవారిలోనే కరోనా తిష్టవేస్తున్నట్లు పరిశోధకులు గుర్తించారు.
🔹 శారీరీక శ్రమ లేని వారిలో ఎక్కువ శాతం కరోనా లక్షణాలు కనిపిస్తున్నట్లు తేల్చారు.
🔹 వారిలోనే మరణాల సంఖ్య కూడా ఎక్కువగా ఉంటుందని అధ్యయనం ద్వారా వెల్లడించారు.
🔹 సుమారు 50 వేల మంది వైరస్ బాధితులను స్టడీ చేసిన తర్వాత ఈ నిర్ధారణకు వచ్చారు.
🔹 మహమ్మారి కన్నా రెండేళ్ల ముందు నుంచి ఎటువంటి శారీరక శ్రమ, వ్యాయామం అలవాటు లేని వారు ఎక్కువ శాతం హాస్పిటల్లో చేరుతున్నట్లు స్పోర్ట్స్ మెడిసిన్ బ్రిటీష్ జర్నల్ పరిశోధకులు తమ నివేదికలో పేర్కొన్నారు.
🔹 కోవిడ్ వ్యాధి సీరియస్గా ఉందంటే వారు వ్యాయామానికి నడకకి దూరంగా ఉన్నట్లు తెలుస్తోందన్నారు.
🔹శారీరక శ్రమ లేని ముసలివాళ్లు,అవయవ మార్పిడి చేసుకున్నవాళ్లలోనూ కోవిడ్ విషమ స్థాయిలో విజృంభిస్తోందని పరిశోధకులు చెప్పారు.
🔹 ధూమపానం, ఊబకాయం,హైబీపీ కన్నా శారీరక శ్రమ లేకపోవడమే అతిపెద్ద రిస్క్ ఫ్యాక్టర్ అని సైంటిస్టులు తెలిపారు
0 Post a Comment:
Post a Comment