ఫోన్ చేసిన 3 గంటల్లోనే కరోనా రోగులకు బెడ్స్ కేటాయించాలి : సీఎం జగన్
🌺 ఫోన్ చేసిన మూడు గంటల్లోనే కరోనా రోగికి బెడ్స్ కేటాయించాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు.
🌺 గురువారం నాడు కరోనాపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.
🌺 ఆసుపత్రుల్లో అవసరానికి మించి ఆక్సిజన్ అందుబాటులో ఉంచాలన్నారు.
🌺 హోంఐసోలేషన్ లో ఉన్నవారిని ఫాలో అప్ చేయాలని అధికారులకు సూచించారు.
🌺 రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ కు అవసరమైన వ్యాక్సిన్ ను సరఫరా చేసేందుకు గాను కేంద్రానికి లేఖ రాయాలని ఆయన అధికారులను కోరారు.
🌺 ప్రస్తుతం అధికారులు ఏ స్పూర్తితో పనిచేస్తున్నారో అదే స్పూర్తితో ముందుకు వెళ్లాలని ఆయన కోరారు.
🌺 రాష్ట్రంలో రెమిడెసివిర్ ఇంజెక్షన్లు అందుబాటులో ఉంచాలని ఆయన కోరారు
🌺 గ్రీవెన్స్ కోసం 1902, కోవిడ్ సేవల కోసం 104 సేవల నెంబర్ కేటాయించాలని ఆయన సూచించారు.
🌺 ఈ నెంబర్లను విస్తృతంగా ప్రచారం చేయాలని కోరారు.
🌺 కరోనా రోగులకు చికిత్స అందిస్తే ఎంత ఫీజు వసూలు చేస్తారో అన్ని ప్రైవేట్ ఆసుపత్రుల్లో బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు.
🌺 ప్రభుత్వం నిర్ధేశించిన పీజు కంటే ఒక్క రూపాయి ఎక్కువగా వసూలు చేసినా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
🌺 మందులు, ఇంజక్షన్ల ధరలు స్పష్టంగా ప్రదర్శించాలన్నారు
0 Post a Comment:
Post a Comment