Saturday 31 October 2020

డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వారి ఆదేశాలు - సంక్షిప్తంగా

 డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వారి ఆదేశాలు - సంక్షిప్తంగా





👉 01-11-2020 న ఆంధ్ర ప్రదేశ్ అవతరణ దినోత్సవం జరపాలి.

👉 అదే రోజు తల్లిదండ్రుల సమావేశం జరిపి పిల్లలను పాఠశాలలకు పంపుటకు సంసిద్దులను చేసి,వారి యొక్క అభిప్రాయాలను కూడా నమోదు చేయాలి.

👉 02-11-2020న 9,10 తరగతులను ప్రారంభించాలి.

👉 23-11-2020 నుండి 6-8 తరగతులను ప్రారంభించాలి.

👉 14-12-2020 నుండి 1-5 తరగతులను ప్రారంభించాలి.

👉 సాధారణ తరగతి గదిలో 16 మంది విద్యార్థులను మాత్రమే కూర్చో బెట్టాలి.

👉 ఒక రోజు 9 వతరగతి, మరుసటి రోజు 10 వతరగతి అనగా రోజు మార్చి రోజు విద్యార్థులు తరగతి వారీగా హాజరు కావాలి.అయితే ఉపాధ్యాయులు ప్రతిరోజు హాజరు కావాలి.

👉 పాఠశాల  ఉ.9 గం.ల నుండి మ1.45 గం.ల వరకు ఉంటుంది. 9 am -9.15am- కోవిడ్ సూచనలు. 9.15 నుండి తరగతులు ప్రారంభమవుతాయి. 👉 ప్రతి 45ని పీరియడ్ తరువాత 5నిllనీటికోసం,10నిll యోగా, సాధారణ నడక ప్రాణాయామం లాంటివి చేయాలి.

👉 మధ్యాహ్నం 1గం.ల తరువాత చివరి 45ని విద్యార్థులకు భోజన సమయం.

👉 విధ్యార్ధులు మరియు ఉపాధ్యాయులు మాస్క్ ధరించాలి,చేతులు శుభ్రం చేసుకోవాలి మరియు భౌతిక దూరం పాటించాలి.

👉 1.45  తరువాత విద్యార్థులు ఇంటికి వెళ్ళి పోతారు.

👉 2 pm -4.15 pm పాఠశాలకు రాని విద్యార్థులకు అన్ లైన్ ద్వారా ఉపాధ్యాయులు భోదన చేయాలి.

👉 ఎస్.సి ఆర్.టి.ఇ వారి ప్రణాళిక ప్రకారం నవంబరు 2 నుండి ఏప్రిల్ 30వరకు పాఠశాలలు జరుగును.మొత్తం 180రోజులు పనిదినాలు వస్తాయి.

👉 పాఠ్యాంశాలకు సంబంధించిన సిలబస్ కోసం అభ్యాస, దీక్షా యాప్ల ద్వారా తెలుసుకోగలరు.దూరదర్శన్, మరియు వాట్సాప్,యూట్యూబ్  ద్వారా విషయ సంగ్రహణ చేయువిధంగా విద్యార్థులను ప్రోత్సహించాలి.

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top