Wednesday 9 September 2020

ఉపాధ్యాయులకు ఐడీలు - ప్రాథమిక, ప్రాథమికోన్నత టీచర్లకు కార్డులు - యూడైస్ కోడ్ తో పాటు ఇతర వివరాలు నమోదు

ఉపాధ్యాయులకు ఐడీలు - ప్రాథమిక, ప్రాథమికోన్నత టీచర్లకు కార్డులు - యూడైస్ కోడ్ తో పాటు ఇతర వివరాలు నమోదు





⚡ రాష్ట్రంలో ప్రభుత్వ ఉపాధ్యాయులకు గుర్తింపు కార్డులు ఇచ్చేందుకు విద్యాశాఖ సిద్ధమవుతోంది. ప్రాథమిక, ప్రాథమి కోన్నత పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులందరికీ ఐడెంటిటీ కార్డులు సిద్ధం చేయాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది.

 ⚡ ఈ మేరకు అన్ని పాఠశాలల ఉపాధ్యాయుల సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఉపాధ్యాయులకు అందజేసే ఐడెంటిటీ కార్డులు ఒక్కొక్క దాని కోసం రూ. 50 చెల్లించను న్నారు. 

⚡ రాష్ట్ర వ్యాప్తంగా ప్రాథమిక పాఠశాలల్లో లక్షా 1, 687 మంది ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తున్నారు. వీరితోపాటుగా కొత్తగా చేరిన  ఉపాధ్యాయుల వివరాలు సేకరిస్తున్నారు.

⚡ ఇందుకోసం జిల్లాలవారీగా విద్యాశాఖాధికారులు, సమగ్ర శిక్ష అదనపు ప్రాజెక్ట్ కో ఆర్డినేటర్లు అవసరమైన డేటాను సిద్ధంచేస్తున్నారు.

⚡ మరోవైపు ఇదే తరహాలో ప్రాథమికోన్నత పాఠశాలల్లోనూ అవసరమైన చర్యలు చేపడుతున్నా రు.

⚡ రాష్ట్రవ్యాప్తంగా ప్రాథమికోన్నత పాఠశాలల్లో 52 వేల 902 మంది ఉపాధ్యాయులు పని చేస్తున్నారు

ఫొటోలు, ఇతర వివరాలతో :

⚡ఉపాధ్యాయులకు అందజేసే గుర్తింపు కార్డుల్లో వారి ఫొటో, పేరు, హోదాతోపాటు పాఠశాల పేరు, యూడైస్ కోడ్,

చిరునామా తదితర వివరాలు నమోదు చేయనున్నారు.

⚡ ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్థులకు ఇస్తున్న తరహాలో ఇకపై ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకు ఈ కార్డులను అందించనున్నారు.

 ⚡ తద్వారా నాడు- నేడు, ఇతర పథకాలకు సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొనడానికి సులభంగా ఉంటుందని చెబుతున్నారు. 

⚡ అంతే కాకుండా పాఠశాలల తనిఖీల సందర్భాల్లో గతంలో అనేక అవకత వకలను విద్యాశాఖ గుర్తించింది. పలువురు ఉపాధ్యాయులు పాఠశాలలకు హాజరు కాకపోయినా హాజరైనట్లుగా నమోదు చేసి నట్లు తనిఖీల్లో వెల్లడయ్యాయి.

⚡ ఇకముందు ఇలాంటి అవకతవకలకు పాల్పడే అవకాశాలు ఉండవని, అటెండెన్స్ ఫిజికల్ వెరిఫికేషన్ సమయంలో ఇలాంటి అవకతవకలు జరగకుండా చూసుకోవచ్చని అధికారులు చెబుతున్నారు.

⚡ ఐడీ కార్డుల కోసం ఇప్పటికే సమగ్ర శిక్ష రాష్ట్ర పథక సంచాలకులు కె. వెట్రి సెల్వి నిధులు విడుదల చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు.

⚡ ఒక్కో కార్డుకు రూ. 50 చొప్పున ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులు లక్షా 1687 మందికి రూ. 50 లక్షల 84 వేల 350,

⚡ ప్రాథమికోన్నత పాఠశాలల ఉపాధ్యాయులు 52 వేల 902మందికి రూ. 26 లక్షల 45 వేల వంద మొత్తాన్ని విడుదల చేశారు. 

⚡ కార్డులు జారీ చేసిన తర్వాత ప్రతి ఉపాధ్యాయుడు తప్పనిసరిగా వాటిని ధరించి తీసుకురావాల్సి ఉంటుందని అధికారులు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు.

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top