కరోనా వైరస్ రాకుండా ఇవి తినండి... ఏపీ ప్రభుత్వ ప్రత్యేక సూచన
మరి ఎలాంటి ఆహారం తీసుకోవాలి. ఏం తినాలి అనే అంశంపై ప్రభుత్వం ఇచ్చిన సూచనలు.
◾ బ్రౌన్ రైస్, గోధుమ పిండి, ఓట్స్. చిరుధాన్యాలు వంటివి తినాలి.
◾బీన్స్, చిక్కుడు, పప్పుధాన్యాలు తినడం ద్వారా శరీరానికి అవసరమైన ప్రోటీన్స్ అందుతాయి.
◾ ఆహారంలో తాజా పండ్లు, కూరగాయలు (కాప్సికమ్, క్యారెట్, బీట్ రూట్, వంకాయ వంటివి) ఉండాలి.
◾ రోజూ కనీసం రెండు లీటర్ల గోరువెచ్చని నీటిని తాగాలి.
◾ పుల్లని నిమ్మ పండు, బత్తాయి తినాలి. వీటిలో వ్యాధిని అడ్డుకునే C విటమిన్ ఉంటుంది. అది వైరస్ నుంచి కాపాడుతుంది.
◾ ఆహారంలో మసాలా ద్రవ్యాలైన అల్లం, వెల్లుల్లి, పసుపు చేర్చాలి. ఇవి వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి.
◾ ఇంట్లో వండేవే తినాలి. క్రొవ్వు పదార్థాలు. నూనెల వాడకం తగ్గించాలి.
◾ పండ్లు, కూరగాయల్ని బాగా కడిగి తినాలి.
◾ వెన్న తీసిన పాలు, పెరుగు తినాలి. వాటిలో ప్రోటీన్, కాల్షియం బాగా ఉంటుంది.
◾ మైదా, వేపుళ్ళు, జంక్ ఫుడ్(చిప్స్, కుక్కీస్) తినవద్దు. వాటిలో పోషకాలు చాలా తక్కువ.
◾ కూల్ డ్రింక్స్, ప్యాక్ట్ జ్యూస్ కార్బోనేటెడ్ డ్రింక్స్ తాగొద్దు.
◾ వెన్న, కొబ్బరి, పామాయిల్, బటర్ తినకండి. వీటిలో అనారోగ్యాన్ని కలిగించే కొవ్వు పదార్థాలు ఉంటాయి
◾ మాంసాహారాన్ని తాజా పదార్ధాలతో పాటు నిల్వ ఉంచొద్దు.
◾ స్కిన్ చికెన్, చేపలు, గుడ్డులో తెల్లసొన వంటి వాటిలో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. అవి ఎక్కువ తినాలి.
◾ మాంసం, లివర్, వేపిన (ఫ్రై) మాంసాన్ని తినకండి.
◾ వారంలో రెండు నుంచి మూడు రోజులు మాత్రమే మాంసాహారాన్ని తినండి.
◾ పూర్తి గుడ్డుని (పచ్చసొనతో కలిపి) వారంలో ఒక్కసారి మాత్రమే తినండి.
🔘 కరోనా వైరస్ సోకిన వారిలో 80 శాతానికి పైగా లక్షణాలు లేకుండా లేదా చిన్న లక్షణాలైన తక్కువ జ్వరం లేక దగ్గు కనిపించవచ్చు. అలాంటి వారు ఆసుపత్రిలో చేరవలసిన అవసరం లేదన్న ప్రభుత్వం. ఇంట్లోనే ఉంటూ ట్రీట్మెంట్ పొందాలని సూచించింది.
0 Post a Comment:
Post a Comment