Monday 20 July 2020

2020-21 విద్యా సంవత్సరానికి పాఠశాలల్లో అడ్మిషన్స్ తీసుకోవటానికి అన్ని పాఠశాలల HM లు పాటించాల్సిన సూచనలు




2020-21 విద్యా సంవత్సరానికి పాఠశాలల్లో అడ్మిషన్స్ తీసుకోవటానికి అన్ని పాఠశాలల HM లు పాటించాల్సిన సూచనలు.


<<<స్కూళ్లలో అడ్మిషన్లు చేపట్టండి>>> 

  <<<విద్యార్థులు రావాల్సిన పనిలేదు>>> 

  <<<తల్లిదండ్రుల సమ్మతుంటే చాలు>>> 

  <<<9వ తరగతి వరకు అంతా ప్రమోట్>>> 

  <<<వలస కూలీల పిల్లలకు టీసీ అక్కర్లేదు>>> 









◾ ప్రభుత్వ స్కూళ్లలో 2020-21 విద్యా సంవత్సరానికి అడ్మిషన్ల ప్రక్రియను చేపట్టాలని పాఠశాల విద్య కమిషనర్ వాడ్రేవు చినవీర భద్రుడు ఆదేశాలు జారీ చేశారు.

◾ ప్రాథమిక, ప్రాథమి కోన్నత, ఉన్నత పాఠశాలల్లో కొత్త అడ్మిషన్ల ప్రక్రియను మండల విద్యాశాఖాధికారులు (ఎంఈఓ), ఉప విద్యాశాఖాధికారులు (డీవైఈఓ) పర్యవేక్షించేలా చర్యలు చేపట్టాలన్నారు.

◾ ఈ మేరకు జిల్లా విద్యాశాఖాధికారులు (డీఈఓ), ప్రాంతీయ సంయుక్త సంచాలకులకు (ఆర్జేడీ) కమిషనర్ సర్క్యులర్లు జారీ చేశారు.

◾ ఒకటో తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకు అంతా పాస్ అయినట్లు ప్రభుత్వం ప్రకటించిందని, ఈ నేపథ్యంలో వారికి సంబంధించిన ప్రమోషన్ జాబితాలను రూపొందించాలన్నారు.

 ◾ తదుపరి తరగతిలో వారి పేర్లను నమోదు చేయాలని సూచించారు.
 ◾ ఇక ప్రాథమిక పాఠశాలలో ఐదో తరగతి చదివిన, యూపీలో ఏడో తరగతి చదివిన విద్యార్థులను యూపీ లేదా హైస్కూళ్లలో చేర్చేందుకు   తల్లిదండ్రుల సమ్మతి తీసుకుంటే సరిపోతుందన్నారు.

◾ ఆరు, ఎనిమిది తరగతులలో చేరేందుకు విద్యార్థులు స్కూళ్లకు రావాల్సిన అవసరం లేదని, వారి తల్లిదండ్రుల నుంచి సమ్మతి పత్రం తీసుకుంటే సరిపోతుందన్నారు.

◾ వారు ఏ స్కూల్ లో చేరాలను కుంటున్నారో ప్రధానోపాధ్యాయులు (హెచ్ఎం)తెలుసుకుని, ఆ వివరాలను సంబంధిత పాఠశాలల హెచ్ఎంలకు తెలపాలన్నారు.

◾ ప్రక్రియను ప్రాథమిక స్కూళ్లలో ఎంఈఓ, హైస్కూళ్లలో డీవైఈఓ పర్యవేక్షించాలన్నారు.

◾ వలస కూలీల పిల్లలకు ఎలాంటి పత్రాలు లేకున్నా అడ్మిషన్ ఇవ్వాలని ఆదేశించారు. వారి నుంచి ఎలాంటి టీసీలను అడగవద్దన్నారు.

 ◾ కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం హెచ్ఎంలు టీసీ, స్టడీ సర్టిఫికెట్లను అడగవద్దని స్పష్టం చేశారు.

◾ ఆదర్శ పాఠశాలలు, కస్తూర్బా బాలికా విద్యాల యాలలో ఆన్లైన్ విధానంలో అడ్మిషన్ల ప్రక్రియ చేపట్టనున్నట్లు తెలిపారు.

◾ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో (కేజీబీవీ) ఖాళీలు ఉన్న ఏడు, ఎనిమిది తరగతులు, ఇంటర్ మొదటి సంవత్సరంలో ప్రవేశానికి ఆన్లైన్ లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు సమగ్ర శిక్షా రాష్ట్ర డైరెక్టర్ కూడా అయిన చినవీరభద్రుడు తెలిపారు.

◾ ఈ నెల 20 నుంచి ఆగస్టు రెండో తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. కేజీబీవీలలో టెన్త్ చదివిన వారు సైతం దరఖాస్తు చేసుకోవాలన్నారు.

Feedback of the Parents to re-opening of Schools

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top