డిగ్రీ పూర్తిచేశాను. ప్రస్తుతం దూరవిద్య ద్వారా ఎంఏ (తెలుగు) చేస్తున్నాను. దీంతోపాటు బ్యాచిలర్ ఇన్ లైబ్రరీ సైన్స్ను కూడా ఒకేసారి దూరవిద్యలో చేద్దామనుకుంటున్నాను. కుదురుతుందా ?
ఒకేసారి రెండు డిగ్రీ కోర్సులను లేదా పీజీ కోర్సులను, ఒక డిగ్రీ, ఒక పీజీ కోర్సును విద్యార్థులు అభ్యసించినట్లయితే ఏదేని ఒక కోర్సు మాత్రమే పరిగణనలోకి వస్తుంది. మీరు దరఖాస్తు చేసుకున్న ఉద్యోగానికి తగినదాన్ని చూపించుకోవాల్సి ఉంటుంది. కాబట్టి సంబంధిత ఉద్యోగ ప్రకటననుబట్టి మీ విద్యార్హతను వాడుకోవాలి. అంతేతప్ప రెండు కోర్సులనూ ఒకే ఏడాది పూర్తిచేసినట్లు చూపిస్తే కొన్నిసార్లు చిక్కులు ఏర్పడే అవకాశముంది. కొన్ని సంస్థలు ఒక దూరవిద్య కోర్సు, ఒక రెగ్యులర్ కోర్సుకు వెసులుబాటు కల్పిస్తాయి.
దూరవిద్య కోర్సును అభ్యసించేముందు సంబంధిత విశ్వవిద్యాలయానికి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ వారి అనుమతి ఉందో లేదో తెలుసుకోవాలి. అనుమతి ఉన్న విశ్వవిద్యాలయం నుంచే కోర్సును అభ్యసించాలి.
0 Post a Comment:
Post a Comment