ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులకు టీకాలు - ఎస్ఈసీ సాహ్నికి ఉద్యోగ నేతల వినతి.
రాష్ట్రంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సన్నద్ధ మవుతున్న నేపథ్యంలో విధుల్లో పాల్గొనే ఉద్యోగులందరికీ వ్యాక్సినేషన్ ప్రక్రి యను త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన నీలం సాహ్నికి ఉద్యోగ నేతలు విజ్ఞప్తి చేశారు.
ఎస్ఈసీగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన సాహ్నినమిపీ జేఏసీ అమరావతి నేత లు గురువారం మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు.
జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి వైవీ రావు, కోశాధికారి వి.వి మురళీకృష్ణనాయుడు, కో చైర్మన్ దొప్పలపూడి ఈశ్వర్, బి కిషోర్ కుమార్ తది తరులు ఎన్నికల కమిషనర్ సాహ్నికి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఈసీ మాట్లాడుతూ రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితులు తీవ్రంగా ఉన్నప్పటికీ ఉద్యో గులు, అధికారులు సమన్వయంతో పనిచేసినందునే పంచాయతీ, మునిసిపల్ ఎన్నికలు విజయవంతంగా నిర్వహించగలిగామన్నారు.
0 Post a Comment:
Post a Comment