పదవ తరగతి పరీక్షలు రద్దు చేయాల్సిన అవసరం ఏమిటంటే....
✅ ప్రభుత్వ కోవిడ్ 19 నిభందనల వలన విద్యార్దులు తప్పునిసరిగా రావాలని ఆదేశాలు లేవు. ఇష్టమైతేనే అని వుంది.
✅ జూన్ నెలలో కరోనా తీవ్రరూప దాల్చుతుంది ..అప్పుడు పరీక్ష పెట్టటం చాలా దారుణం అని విద్యావేత్తల అభిప్రాయం ..
1.చాలా మంది విద్యార్థులు కోవిడ్ భయంతో పాఠశాల కు 60% కూడా హాజరు అవ్వలేదు....
2.కోవిడ్ కేసుల వలన అన్ని పాఠశాలల పనిదినాలు ఒకే రకంగా లేవు...జరగలేదు ..
3.ఆరోగ్య సమస్యలు కోవిడ్ & జలబు & జర్వం ఉన్న విద్యార్థులు పాఠశాల కు 30% రావడం లేదు.
తల్లిదండ్రలు పంపించటం లేదు
4.హాస్టళ్లలో ఉండే విద్యార్థులు ఈ సంవత్సరం హాస్టల్లో ఉండడానికి భయపడి హాజరు శాతం తక్కువగా ఉంది.
5.బడికి విద్యార్థుల హాజరు తప్పనిసరి అని ప్రభుత్వం ప్రకటించలేదు.. తల్లిదండ్రుల అనుమతి ఉంటేనే అనుమతించడం జరిగింది.
6.ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో విద్యార్థులు, ఉపాద్యాయులు, తల్లిదండ్రులు ఎవరు కోవిడ్ బారిన పడినా వాహకులుగా మారే ప్రమాదం పొంచిఉంది కనుక తల్లిదండ్రుల,విద్యార్థుల సంక్షేమం కొరకు,వారి మానసిక ఆందోళన తగ్గించుట కొరకు.
✅ 10 వ తరగతి పరీక్ష ల కొసం వందల సంఖ్య బస్సులో ప్రయాణం. వేల సంఖ్య లలో ఆటోల ప్రయాణం, తల్లితండ్రులుతో పట్టణాలలో పరీక్ష సెంటర్లు లలో వేల సంఖ్యలో గుమి గూడతారు ..
✅ రాసిన 10 తరగతి పరీక్ష పేపర్ దిద్దటానికి జిల్లా మెుత్తం ఓక స్కూల్ కు వేల సంఖ్య లో వచ్చి 7 గంటల పాటు పేపర్స్ దిద్దడం తో కరోనా సోకే ప్రమాదం.
10 వ తరగతి పరీక్షలు రద్దుచేసి అందరికి న్యాయం చేయవలసినదిగా విజ్ఞప్తి.
0 Post a Comment:
Post a Comment