మహా విషాదం: ఆసుపత్రిలో ఆక్సిజన్ లీక్.... ఊపిరాడక 11 మంది రోగులు మృతి
👉 మహారాష్ట్రలో ఘోరం జరిగింది. ప్రాణ వాయువే ప్రాణాలు తీసింది.
👉 నాసిక్లోని డాక్టర్ జాకిర్ హుస్సేన్ ఆస్పత్రిలో ఆక్సీజన్ ట్యాంకర్ లీకయింది.
👉 ఈ క్రమంలో రోగులకు ఆక్సీజన్ సరఫరా నిలిచిపోయి ఐసీయూలోని 11 మంది రోగులు మరణించారు.
👉 మహారాష్ట్రలోని కరోనా ఆస్పత్రుల్లో ఆక్సీజన్ కొరత నేపథ్యంలో పెద్ద ఎత్తున ఆక్సీజన్ ట్యాంకర్లను పంపిస్తున్నారు.
👉 ఈ క్రమంలోనే నాసిక్లోని జాకీర్ ఆస్పత్రికి కూడా ట్రక్కుల ద్వారా ఆక్సీజన్ తరలించారు.
👉 వాటిని ఆస్పత్రిలోని ట్యాంకర్లో నింపుతుండగా ఒక్కసారిగా ఆక్సీజన్ లీకయింది.
👉 పెద్ద మొత్తంలో లీకవడంతో దట్టమై పొగలు అలుముకున్నాయి.
👉 సమాచారం అందుకున్న రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.
0 Post a Comment:
Post a Comment