Monday 11 July 2022

విదేశాల్లో చదువుకునే వారికి ఏపీ ప్రభుత్వం బంపర్ ఆఫర్. అగ్రకులాల వారికి కూడా...

విదేశాల్లో చదువుకునే వారికి ఏపీ ప్రభుత్వం బంపర్ ఆఫర్. అగ్రకులాల వారికి కూడా...


జగనన్న విదేశీ విద్యా దీవెన (Jagananna Vidya Deevena) పై ఉత్తర్వులు వెలువరించింది.

● ఆర్థికంగా వెనుకబడ్డ అగ్రకులాలవారికీ కూడా ఈ పథకంలో భాగం కల్పిస్తూ తాము ప్రతిభను ప్రొత్సహిస్తామన్న సంకేతాలు పంపింది.

● క్యూఎస్‌ ర్యాంకింగ్స్‌(QS World University Rankings)లో ప్రపంచంలోని మొదటి 200 యూనివర్శిటీల్లో సీటు సాధించిన వారి ఖర్చును ప్రభుత్వమే భరించనుంది.

● మొదటి 100 ర్యాంకింగ్స్‌లో ఉన్న యూనివర్శిటీల్లో సీటు సాధిస్తే పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇవ్వనుంది.

● 100 పైబడి 200 ర్యాంకింగ్స్‌లో ఉన్న యూనివర్శిటీల్లో సాధిస్తే రూ.50లక్షలు వరకూ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వర్తింపు చేయనున్నట్లు తెలిపింది.

● నాలుగు వాయిదాల్లో నేరుగా బ్యాంకు ఖాతాల్లోకి ఫీజు రియింబర్స్‌మెంట్‌ డబ్బు జమ చేయనున్నట్లు తెలిపింది.

● ఏడాదికి రూ.8 లక్షల లోపు ఆదాయం ఉన్న వారందరికీ ఈ పథకం వర్తింపజేస్తూ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.

● 35 ఏళ్లలోపు ఉన్న వారందరూ అర్హులుగా తెలిపింది.

● ఏపీలో స్థానికుడై ఉండాలి.

● అయితే కుటుంబంలో ఒక్కరికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది.

● ప్రతి ఏటా సెప్టెంబరు-డిసెంబరు, జనవరి-మే మధ్య అర్హుల గుర్తింపుకోసం నోటిఫికేషన్‌ విడుదల చేస్తుంది ప్రభుత్వం.

● రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని కమిటీచే అర్హుల ఎంపిక పారదర్శకంగా జరుగుతుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో తెలిపింది.


DOWNLOAD G.O.Ms.No.39, Dated: 11-07-2022

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top