Tuesday, 21 June 2022

ఏ.పి లో ఒక రోజు ఆల‌స్యంగా పాఠ‌శాల‌ల పునఃప్రారంభం.

 ఏ.పి లో ఒక రోజు ఆల‌స్యంగా పాఠ‌శాల‌ల పునఃప్రారంభం.




జూలై 4న పునఃప్రారంభం కానున్న పాఠ‌శాల‌లు
అదే రోజున రాష్ట్ర పర్య‌ట‌న‌కు వ‌స్తున్న ప్ర‌ధాని మోదీ
మంగ‌ళ‌గిరి ఎయిమ్స్‌ను ప్రారంభించ‌నున్న ప్ర‌ధాని
ప్ర‌ధాని టూర్ నేప‌థ్యంలోనే ఒక రోజు ఆల‌స్యంగా పాఠ‌శాల‌ల పునఃప్రారంభం

ఏపీలో వేస‌వి సెల‌వుల త‌ర్వాత‌ పాఠ‌శాల‌లు జూలై 4న పునఃప్రారంభం కానున్న‌ట్లు గ‌తంలోనే రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. అయితే జూలై 4న కాకుండా జూలై 5న పాఠ‌శాల‌ల‌ను పునఃప్రారంభించాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం మంగ‌ళ‌వారం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. వెర‌సి ముందుగా ప్ర‌క‌టించిన తేదీ కంటే ఒక రోజు ఆల‌స్యంగా ఏపీలో పాఠ‌శాల‌లు పునఃప్రారంభం కానున్నాయ‌న్న మాట‌.

పాఠ‌శాల‌ల‌ను ఒక రోజు ఆల‌స్యంగా తెరిచేందుకు గ‌ల కార‌ణాల‌ను కూడా ప్రభుత్వ వ‌ర్గాలు వెల్ల‌డించాయి. జూలై 4న ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ రాష్ట్ర ప‌ర్య‌ట‌న‌కు వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. మంగ‌ళ‌గిరి ప‌రిధిలో కొత్త‌గా నిర్మించిన ఎయిమ్స్‌ను ప్ర‌ధాని ప్రారంభించ‌నున్నారు. ప్ర‌ధాని ప‌ర్య‌ట‌న నేప‌థ్యంలోనే పాఠ‌శాల‌ల పునఃప్రారంభాన్ని ఒక రోజు వాయిదా వేసిన‌ట్లుగా ప్ర‌భుత్వ వ‌ర్గాలు చెబుతున్నాయి.

దీనిపై అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More

Subscribe Get Alerts

Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top