Monday 28 March 2022

ఉపాధ్యాయులకు మొబైల్ ఈ-హాజరు : పాఠశాల వద్ద మాత్రమే హాజరు నమోదుకు అవకాశం

ఉపాధ్యాయులకు మొబైల్ ఈ- హాజరు : పాఠశాల వద్ద మాత్రమే హాజరు నమోదుకు అవకాశం


వచ్చే ఏడాది నుంచి విద్యార్థుల హాజరు ఆన్లైన్లోనే



సెల్ ఫోన్ ద్వారా ఉపాధ్యాయుల ఆన్లైన్ హాజరుకు పాఠశాల విద్యాశాఖ నాలుగు రకాల యాప్లను రూపొందించింది . వీటిని నాలుగు జోన్లలోని పాఠశాలల్లో ప్రయోగాత్మకంగా పరిశీలన చేస్తోంది.

గుంటూరు జిల్లాలోని పల్నాడు ప్రాంతంలో ఈనెల 26 న ప్రయోగాత్మక పరిశీలన ప్రారంభించగా... తూర్పుగోదావరి జిల్లాలో మంగళవారం నుంచి పరిశీలన చేపట్టనున్నారు . అనంతపురంలో ఈనెల 31 న , ప్రకాశంలో ఏప్రిల్ 1 నుంచి ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు.

తూర్పుగోదావరి జిల్లాలో మొదట 15 మండలాల్లో అమలు చేయనున్నారు . అక్కడ వచ్చే ఫలితాల ఆధారంగా జిల్లా మొత్తం ఈ యాప్ ఆధారిత హాజరును అమల్లోకి తీసుకువస్తారు . హాజరు యాప్ను ఉపాధ్యాయులు తమ సెల్ఫోన్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు . పాఠశాల వద్ద మాత్రమే హాజరు నమోదుకు అవకాశం ఉంటుంది.

వచ్చే ఏడాది నుంచి విద్యార్థుల హాజరు ఆన్లైన్లోనే తీసుకోనున్నారు . ఇప్పటికే కృష్ణా జిల్లాలో జనవరి నుంచి అమలు చేస్తున్న విధానాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయనున్నారు . సెల్ఫోన్లోని యాప్ ద్వారా తరగతిలోని పిల్లల ఫొటో తీసి , ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది . ఫొటోలోని విద్యార్థుల ఆధారంగా హాజరు నమోదవుతుంది . కృత్రిమేథ సాంకేతికతతో విద్యార్థులను గుర్తిస్తున్నారు .

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top