ప్రభుత్వ పాఠశాల విద్యార్థినుల గిరిజన "థింసా" నృత్య ప్రదర్శన - మాకన్నపురం, శ్రీకాకుళం జిల్లా
మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల, మాకన్నపురం ( సోంపేట మండలం) శ్రీకాకుళం జిల్లా విద్యార్థునిల నేర్చుకున్న ఈ వైవిధ్య మైన థింసా నృత్య ప్రదర్శన పాఠశాల వార్షికోత్సవం లో తొలుత ప్రదర్శించడం జరిగింది.అనంతరం అదే గ్రామంలో జబర్దస్త్ ఆర్టిస్టులు హాజరైన ప్రత్యేక ప్రోగ్రాం నందు ఆ వేదిక లో వారి యెదుట ప్రదర్శన ఇవ్వటంతో ఒక్కసారిగా వీరి ప్రతిభ వాడ వాడలకు విస్తరించింది.అప్పటి నుంచి నేటి వరకు ప్రతీ అవకాశాన్ని అంది పుచ్చుకుంటూ మరింత మెరుగుపర్చుకుంటూ నిన్న రాత్రి మహా శివరాత్రి సందర్భంగా కొత్తపల్లి గ్రామంలో ఇచ్చిన ప్రదర్శన మరిన్ని మన్ననలు పొందటమే కాకుండా దీని వ్యాప్తి ప్రస్తుత గౌరవ మత్స్య,పశుసంవర్ధక శాఖామాత్యులు వారికి చేరి ఆదివాసీ దినోత్సవం నాడు జరిగే ప్రత్యేక కార్యక్రమంలో ఈ పాట నృత్య ప్రదర్శన జరగాలని ముందస్తు ఆహ్వానం పలకటం విద్యార్థులు సంతోషం వ్యక్త పరుస్తున్నారు.
ఈ సందర్భంగా విద్యార్థులకు,ఆహ్వానిత యాజమాన్యానికి,ఆదరించిన కొత్తపల్లి గ్రామస్థులకు,సహకరించిన విద్యార్థుల తల్లి దండ్రులకు కృతజ్ఞతాభినందనలు.
0 Post a Comment:
Post a Comment