Tuesday 8 March 2022

ఫిట్మెంట్ 27% కన్నా ఎక్కువే ఇవ్వాలి - 2018 జూలై ధరల నేపథ్యంలో మిశ్రా నివేదిక - 9న హైకోర్టుకు నివేదించనున్న సంఘాలు

ఫిట్మెంట్ 27% కన్నా ఎక్కువే ఇవ్వాలి - 2018 జూలై ధరల నేపథ్యంలో మిశ్రా నివేదిక - 9న హైకోర్టుకు నివేదించనున్న సంఘాలు



అశుతోషమిశ్రా నివేదిక రేకెత్తించిన ప్రకంపనలు రోజురోజుకూ తీవ్రరూపం

దాల్చుతున్నాయి. ఇప్పటికే పిఆర్సి పై హైకోర్టు ముందున్న కేసు విచారణ గురువారం జరగనుంది. దీనికోసం తాజాగా అశుతోష్ మిశ్రా సిఫార్సుల్లోని అంశాలను కూడా ఉద్యోగ సంఘ నేతలు తమ వాదనలకు సిద్ధం చేస్తున్నారు. ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసిన తరువాత ఉద్యోగులు కూడా తమ అఫిడవిట్ను దాఖలు చేయాలని యోచిస్తున్నారు. కాగా అశుతోష్మిశ్రా సిఫార్సులు 2018 జూలై ఒకటిన ఉన్న ధరల మేరకు సమర్పించినదిగా ఉద్యోగులు చెబుతున్నారు. అప్పుడే ఫిట్మెంట్ను 27 శాతంగా మిశ్రా సిఫార్సు చేశారని వారంటున్నారు. అయితే ఇప్పుడు 2021లో ప్రభుత్వం ప్రకటించిన పిఆర్సిలో నాలుగు శాతం తగ్గించి 23 శాతమే ప్రకటించడంపై వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి మూడేళ్లలో మారిన ఆర్థిక పరిస్థితుల కారణంగా ఫిట్మెంట్ను 27 కన్నా ఎక్కువ ప్రకటించాల్సి ఉంటుందని వారు అభిప్రాయపడ్డారు. నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయని, అందువల్ల ఆర్ధికంగా ఉద్యోగులు తీవ్ర నష్టంపాలవుతున్నారని ఆయన పేర్కొన్నారు.

అలవెన్సులేవి...?

ఇదే సమయంలో ప్రభుత్వం ప్రకటించిన పిఆర్సిలో అలవెన్సుల అంశం లేకపోవడాన్ని కూడా ఉద్యోగ సంఘాలు ఎత్తిచూపుతున్నాయి. ప్రధానంగా ఉద్యోగులకు వాహన కొనుగోళ్లు, వారి పిల్లలకు ట్యూషన్ ఫీజు, వారు తీసుకునే రుణాలు వంటివి కూడా ఉద్యోగి స్థాయి, అతని జీతం ఆధారంగా నిర్ణయిస్తారు. ప్రతి పీఆర్సీలోనూ ఈ అంశాలను పొందుపరచడం జరుగుతుందని ఉద్యోగులు అంటున్నారు. అయితే ఈ పిఆర్సీలో మాత్రం ఆ ప్రస్తావన లేదని చెబుతున్నారు. దీనిపై మరోసారి ప్రత్యేక ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉంటుందని వారన్నారు.

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top