Friday 25 March 2022

కేబినెట్ సబ్ కమిటీతో జరిగిన చర్చలు వాటి వివరములు ,విజయవాడ తేది: 24-03-2022

 కేబినెట్ సబ్ కమిటీతో జరిగిన చర్చలు వాటి వివరములు , విజయవాడ తేది: 24-03-2022 



రాష్ట్ర సచివాలయంలో ఈరోజు జరిగిన కేబినెట్ సబ్ కమిటీ సమావేశానికి ప్రభుత్వ ముఖ్యసలహాదారు శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి , గౌరవ మంత్రివర్యులు శ్రీ బొత్స సత్యనారాయణగారు , శ్రీ పేర్ని వెంకట్రామయ్య ( నాని ) గారు , ప్రభుత్వ సలహాదారు ( ఉద్యోగుల సంక్షేమం ) శ్రీ ఎన్ . చంద్రశేఖర్రెడ్డి గారు , ప్రభుత్వం తరపునుండి హాజరు కాగా , ఏ.పి. ఎన్జీవో సంఘం నుండి రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కామ్రేడ్ బండి శ్రీనివాసరావు , కామ్రేడ్ కె.వి. శివారెడ్డి , రాష్ట్ర ప్రచార కార్యదర్శి కామ్రేడ్ కె . జగదీశ్వరరావులు హాజరయ్యారు . ఈ సమావేశంలో 5-2-2022న ఉద్యోగ సంఘాలతో జరిగిన చర్చల సందర్భంగా ఇచ్చిన మినిట్స్లోని అంశాలలో ఇంకా రావలసిన జి.వో. లను గూర్చి చర్చించారు.

అందు ముఖ్యంగా...

 1. తేది 1-7-2019 నుండి 31-3-2020 వరకు ఐ.ఆర్ . రికవరీపై తగు క్లారిటీతో జి.వో. ఇవ్వవలసి ఉన్నదని , వెంటనే విడుదల చెయ్యాలని కోరారు.

2. విధి నిర్వహణలో మరణించిన ఉద్యోగి మరియు పెన్షనర్ల దహన సంస్కారాల ఖర్చుల కోసం ( మట్టి ఖర్చులు ) పెంపుదల చేసిన మొత్తముతో జి.వో.ను వెంటనే విడుదల చేయాలని ,

3. 11 వ పి.ఆర్.సి.ని పబ్లిక్ సెక్టార్ , యూనివర్సిటీలు , కార్పొరేషన్లు , సొసైటీలు మరియు గురుకులాల ఉద్యోగులకు వర్తింప చేస్తూ ఇవ్వలసిన జి.వో.ను తక్షణమే వారంలోపు విడుదల చేయాలని కోరారు.

4. అలాగే పబ్లిక్ ట్రాన్సుఫోర్టు డిపార్టుమెంట్ ( ఆర్.టి.సి. ) వారికి 11 వ పి.ఆర్.సి.ని వర్తింపజేస్తూ జి.వో.ను వెంటనే విడుదల చేయాలని కోరారు . దీనిపై సుదీర్ఘమైన చర్చ అనంతరం ఒక వారం లోపు జి.వో. విడుదల చేయాలని నిర్ణయించడమైనది.

 5. డి.ఏ.లకు సంబంధించిన ఎరియర్స్ చెల్లింపుకు కావలసిన జి.వో.ను వెంటనే విడుదల చేయాలని , 

6. కాంట్రాక్టు ఉద్యోగుల జీతాలు వెంటనే 2022 రివైజుడ్ పే స్కేల్స్ ప్రకారం అనగా పే , డి.ఏ. , హెచ్.ఆర్.ఏ. ఇస్తూ సర్వీస్ రెగ్యులరైజ్ చేయాలని కోరారు.

7. జిల్లాల పునర్విభజన సందర్భముగా ఉద్యోగుల కేటాయింపులలో అన్ని డిపార్టుమెంట్లకు సరియైన గైడ్లైన్స్ ఇవ్వాలని , ముఖ్యంగా ఉద్యోగులకు ఆప్షన్ ఇవ్వాలని , స్పౌజ్ ( భార్యాభర్తలు ) ఒకే చోట ఉండే విధంగా గైడ్లైన్స్ ఇవ్వాలని , గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాల కార్యవర్గ సభ్యులకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరడమైనది.

8 . ప్రభుత్వం నుండి  చెల్లించవలసిన జి.పి.ఎఫ్ . , ఏ.పి.జి.ఎల్.ఐ. , మెడికల్ బిల్లులు , సరెండర్ లీవులు మరియు పోలీసుల ఎల్సరెండర్ లీవులు తక్షణమే విడుదల చేయాలని కోరారు . అలాగే ఆర్ధిక శాఖ అధికారులు ఉద్యోగ సంఘాలతో సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు.

9. గతంలో ఏ.పి. జె.ఏ.సి. మరియు ఏ.పి. జె.ఏ.సి. అమరావతి సంయుక్తంగా ఇచ్చిన 71 అపరిష్కుత అంశాలపై చర్యలు తీసుకోవాలని కోరారు . వీటిపై త్వరలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని పరిష్కరించుకుందామని కేబినేట్ సబ్కాకమిటీ సభ్యులు తెలిపారు. 

- బండి శ్రీనివాసరావు.


CLICK HERE TO DOWNLOAD

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top