ఏపీలో కొనసాగుతున్న ఉపాధ్యాయ, ఉద్యోగుల ఆందోళనలు
✰ పీఆర్సీ అంశంలో రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వంపై ఉపాధ్యాయులు, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల ఆందోళనలు కొనసాగుతున్నాయి.
✰ నేడు పీఆర్సీ సాధనసమితి స్టీరింగ్ కమిటీకి ఉపాధ్యాయ సంఘాలు రాజీనామా చేయనున్నారు.
✰ భవిష్యత్ కార్యాచరణను ఉపాధ్యాయులు ప్రకటించనున్నారు.
✰ ఉపాధ్యాయుల బాటలోనే తాము సైతం అని కాంట్రాక్టు,ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు అంటున్నారు.
✰ మెరుగైన పీఆర్సీ కోసం ఉమ్మడి వేదిక ఏర్పాటు చేసి ప్రభుత్వంపై పోరాడుతామని ఉపాధ్యాయులు స్పష్టం చేశారు.
✰ ఈరోజు మీడియా సమావేశంలో ఉపాధ్యాయులు భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నారు.
✰ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమానికి సంబంధించి ఆన్లైన్ సమావేశంలో ఉపాధ్యాయుల సలహాలు, సూచనలను ఉపాధ్యాయ సంఘ నేతలు తెలుసుకున్నారు.
✰ చివరకు ఉద్యమం తప్పదని ఉపాధ్యయలు ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.
0 Post a Comment:
Post a Comment