రెండు మూడు రోజుల్లో చేయలేం : వేతన బిల్లులపై ట్రెజరీ అసోసియేషన్ లేఖ
కొత్త పీఆర్సీ ప్రకారం ఉద్యోగుల వేతన బిల్లులు ప్రాసెస్ చేయడానికి తమకు రెండుమూడ్రోజుల సమయం సరిపోదని, మరిం త సమయం కావాలని కోరుతూ ట్రెజరీ డైరెక్టర్ కార్యా లయానికి ఏపీ ట్రెజరీ సర్వీసెస్ అసోసియేషన్ శుక్రవా రం లేఖ రాసింది. పదకొండో పీఆర్సీ ప్రకారం కొత్త వేత నాల బిల్లులు ప్రాసెస్ చేయడానికి ఉద్యోగుల సర్వీస్ రిజిస్టర్లు కావాలని ట్రెజరీ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు శోభన్ బాబు ఆ లేఖలో పేర్కొన్నారు. సర్వీస్ రిజిస్టర్ల వెరిఫికేషన్ తర్వాతే ఫిక్సేషన్ ఎలా జరిగిందో తెలుస్తుందని, లేకపోతే బిల్లులు చేయలేమని చెప్పారు. కొత్త పీఆర్సీ ప్రకారం జీతాల చెల్లింపులో పొరపాట్లు జరిగితే ట్రెజరీ అధికారులను ఆ తప్పునకు బాధ్యులను చేస్తామని జీవో నెంబరు 1లో ఇచ్చారని తెలిపారు. సమ యం ఇవ్వకపోతే పొరపాట్లు జరిగి.. ప్రజాధనం నష్ట పోయే ప్రమాదం ఉందన్నారు. ఉద్యోగుల జీతాలు ప్రా సెస్ చేసే రాష్ట్ర ట్రెజరీ వ్యవస్థ సర్వర్లలో సమస్యలు తలెత్తాయని అధికారులు చెప్పారు. అయినప్పటికీ కొత్త పీఆర్సీ అమలుకు సర్కారు ప్రయత్నిస్తోందని పేర్కొన్నారు.
0 Post a Comment:
Post a Comment