స్కూళ్లను మూసివేయాలని ప్రభుత్వం చూస్తోంది : పీడీఎఫ్ ఎమ్మెల్సీలు
రాష్ట్రంలోని 35,000 స్కూళ్లను మూసివేయాలని జగన్ ప్రభుత్వం చూస్తోందని పీడీఎఫ్ ఎమ్మెల్సీలు ఆరోపించారు. నూతన విద్యావిధానంపై సమావేశాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ సమావేశాన్ని పీడీఎఫ్ ఎమ్మెల్సీలు వెంకటేశ్వర్లు, షేక్ సాబ్జి, రఘువర్మ బహిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ పిల్లల దగ్గరకు బడి కాకుండా బడి దగ్గరకు పిల్లలు అని తీసుకువచ్చారని వారు ఆరోపించారు. కేవలం ఎకానమీ కోసం ఈ మెర్జింగ్ను తెరమీదకు తెచ్చారని వారు పేర్కొన్నారు. నూతన జాతీయ విద్య విధానం విషయంలో వారు చెప్పనవి కూడా ఇక్కడ అమలు చేస్తున్నారన్నారు. దీనికి వ్యతిరేకంగా అసెంబ్లీ సహా బయట కూడా పోరాటం చేస్తామని వారు ప్రకటించారు.
నాడు-నేడు ద్వారా కోట్లాది రూపాయలు ఖర్చు చేశారన్నారు. ఇప్పుడు వాటిల్లో పిల్లలు లేకుండా మూసేస్తున్నారని వారు ఆరోపించారు. ఏపీలో కేరళ, హిమాచల్ప్రదేశ్, ఢిల్లీ తరహా విద్యను ప్రోత్సహించాలని వారు కోరారు. తమ అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకపోవడంతో సమావేశాన్ని బహిష్కరించామని ఎమ్మెల్సీలు తెలిపారు
0 Post a Comment:
Post a Comment