ప్రపంచ స్థాయి విద్యా ప్రమాణాలే లక్ష్యం: రామ్మాధవ్
తాడేపల్లిగూడెం, డిసెంబరు 23(ఆంధ్రజ్యోతి): విద్యా రంగంలో ప్రపంచ స్థాయి ప్రమాణాలు పెంచడమే నూతన విద్యా విధాన లక్ష్యమని బీజేపీ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి, ఆర్ఎ్సఎస్ జాతీయ కార్యవర్గ సభ్యుడు రామ్మాధవ్ చెప్పారు. తాడేపల్లిగూడెంలోని ఏపీ నిట్లో గురువారం ‘మదన్మోహన్ మాలవ్య అకడమిక్ కాంప్లెక్స్’, సెమినార్ హాల్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యా రంగంలో నూతన ఒరవడి-జాతీయ విద్యా విధానంపై రామ్మాధవ్ ప్రసంగించారు. ప్రపంచంలోని టాప్-15 విద్యా సంస్థల్లో దేశంలోని ఒక్క సంస్థ కూడా లేకపోవడం విచారకరమన్నారు.
0 Post a Comment:
Post a Comment