ఇన్స్పైర్ అవార్ట్స్ మనాక్ (2020-21) రాష్ట్రస్థాయికి 36 ప్రాజెక్టుల ఎంపిక
ఇన్స్పైర్ అవార్ట్స్ మనాక్ (2020-21) ప్రాజెక్టులకు సంబంధించి జిల్లా నుంచి 36 మందిని రాష్ట్రస్థాయికి ఎంపిక చేసినట్లు డీఈవో తాహెరా సుల్తానా తెలిపారు. పటమట కేఎస్ఆర్ జడ్పీ ఉన్నత పాఠశాలలో శుక్రవారం ఆన్లైన్ విధానంలో ఎంపికలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ పోటీల్లో సుమారు 300 మంది విద్యార్థులు వారు తయారు చేసిన వాటిని ప్రదర్శించారని పేర్కొన్నారు. న్యాయనిర్ణేతలు ఉత్తమంగా ఉన్న 36 ప్రాజెక్టులను ఎంపిక చేశారని చెప్పారు. త్వరలోనే రాష్ట్ర పోటీలు నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో ఉపవిద్యాధికారి వేణుగోపాల్, రిసోర్సుపర్సన్లు పాల్గొన్నారు.
🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇
0 Post a Comment:
Post a Comment