ఇక పీపీ 1, పీపీ 2తో ఫౌండేషన్ విద్య : విద్యాహక్కు చట్టం జీవో సవరణ జీవో జారీ
రాష్ట్రంలో ప్రీప్రైమరీ (పీ పీ)1, 2ల ద్వారా బాలలకు సమర్థమైన ఫౌండేషన్ విద్య అందించేందుకు వీలుగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈమేరకు విద్యా హక్కు చట్టంపై 2011 మార్చి 3వ తేదీన జారీచేసిన జీవో 20ని సవరిస్తూ జీవో 85 ను పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బి. రాజ శేఖర్ సోమవారం విడుదల చేశారు. గత జీవోలో ప్రైమరీ పాఠశాలల ఆవరణలో సర్వ శిక్ష అభియాన్ ఆధ్వర్యంలో ఎర్లీ చైల్డ్ హుడ్ కేర్ సెంటర్లను ఏర్పాటుచేసి 3-5 ఏళ్ల మధ్య పిల్లలకు ప్రీస్కూల్ ఎడ్యుకేషన్ అందించాలని నిర్దే శించారు. తాజా జీవోలో దాన్ని సవరిస్తూ 3-5 ఏళ్ల పిల్లలకు మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఎర్లీ చైల్డ్ హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ (ఈసీసీఈ) ద్వారా ఫౌండేషనల్, ఫౌండేషనల్ ప్లస్ స్కూళ్లు, లేదా శాటిలైట్ ఫౌండేషనల్ స్కూళ్లలో ప్రీస్కూల్ విద్యను అందించాలని పేర్కొన్నారు. ఎలిమెంటరీ స్కూళ్ల తరగతు లకు గతంలో ఇచ్చిన వివరణను ఫౌండేషనల్, ఫౌండేషనల్ ప్లస్, ప్రీ హైస్కూల్, హైస్కూళ్ల లోని తరగతులుగా మార్చారు. ఒక కిలోమీట రు దూరంలో ఫౌండేషనల్, ఫౌండేషనల్ ప్లస్ స్కూలు, 3 కిలోమీటర్ల పరిధిలో 3 నుంచి 8వ తరగతి వరకు ప్రీ హైస్కూలు, హైస్కూలు ఉండాలని పేర్కొన్నారు. ఫౌండేషనల్ స్కూళ్ల కు ఒక కిలోమీటరుకు పైబడి ఉండే అంగన్ వాడీ సెంటర్లను పీపీ1, పీపీఓలతో శాటిలైట్ ఫౌండేషనల్ స్కూళ్లుగా పేర్కొన్నారు. ఇలా మరికొన్ని సవరణలతో జీవోను జారీచేశారు.
0 Post a Comment:
Post a Comment