Sunday 30 May 2021

ప్రజలకు అలెర్ట్, కరోనా రాకపోయినా బ్లాక్ ఫంగస్‌ వస్తుంది.

 ప్రజలకు అలెర్ట్, కరోనా రాకపోయినా బ్లాక్ ఫంగస్‌ వస్తుంది.



ఈ బ్లాక్ ఫంగస్ అనేది… ఓ రకమైన ఫంగస్ వల్ల వ్యాపిస్తుంది. దీన్నే సింపుల్ భాషలో బూజు అంటారు. ఇది గాలిలో ఎగిరే బూజు. ఇళ్లలో పరిశుభ్రంగా లేని చోట… ఈ బూజు తిష్టవేస్తుంది. ఎప్పుడు మనిషిని తినేద్దామా అని చూస్తుంది.అయితే ఇప్పటికే రెండు రాష్ట్రాలలో వందల కేసులు వెలుగు చూస్తున్నాయి. ఈ బ్లాక్ ఫంగస్ చాలా డేంజరస్.. ఏకంగా ప్రాణాలు తీసేస్తోంది. ఇప్పటికే ఈ బ్లాక్ ఫంగస్‌ కేసులకు చికిత్స అందించేందుకు ప్రభుత్వాలు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. అయితే ఇప్పుడు ఈ బ్లాక్ ఫంగస్‌ గురించి మరిన్ని షాకింగ్ విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఇప్పటి వరకూ బ్లాక్ ఫంగస్‌ కరోనా వచ్చిన రోగుల్లోనే కనిపిస్తుందని చాలా మంది భావిస్తున్నారు.

ఇప్పుడు వెలుగు చూస్తున్న బ్లాక్ ఫంగస్ కేసులన్నీ నూటికి 99 శాతం అలాంటివే. అయితే.. కొవిడ్‌ సోకిన వారికి మాత్రమే ఈ వ్యాధి వస్తుందా? ఇతరులకు కూడా వచ్చే అవకాశం ఉందా? అనే ఈ అంశంపై నిపుణులు ఏమంటున్నారంటే.. ఈ బ్లాక్‌ ఫంగస్ వ్యాధి కొత్తేం కాదని… కొవిడ్‌కు ముందు కూడా ఉందని చెబుతున్నారు. మధుమేహం అంటే సుగర్ సరిగ్గా కంట్రోల్‌లో లేని వారికి ఈ వ్యాధి సోకే ప్రమాదం ఉందట.. మధుమేహంతో పాటు ఇతర వ్యాధులతో బాధపడేవారిలో బ్లాక్ ఫంగస్ బయటపడే అవకాశం ఉందట.

రక్తంలో చక్కెర స్థాయులు 700-800కి చేరిన వారు, నిమోనియా వంటి వ్యాధులతో బాధపడుతున్నవారిలో బ్లాక్ ఫంగస్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు కొవిడ్ కారణంగా కొందరిలో స్టిరాయిడ్ల వాడకంతో బ్లాక్‌ ఫంగస్ ముప్పు పొంచి ఉంది. మొత్తంగా కరోనా పాజిటివ్ కాకపోయినా.. ఈ తరహా సమస్యలుంటే బ్లాక్‌ ఫంగస్‌ బారిన పడే అవకాశం ఉందన్న మాట.

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top