అమ్మ ఒడి పథకం
రాష్ట్రంలోని నిరుపేద కుటుంబాల పిల్లల చదువు కోసం అయ్యే ఖర్చు భారాన్ని తగ్గించే దిశగా తమ పిల్లల్ని చదివించుకుని ఉన్నటువంటి తల్లికి ప్రతి సంవత్సరం 15 వేల రూపాయలను ఆర్థిక సహాయం అందజేయడం జరుగుతుంది.
ప్రయోజనాలు :
ఆంధ్ర రాష్ట్రంలో గుర్తింపు పొందిన టువంటి పాఠశాలలోనూ, ప్రైవేట్ పాఠశాలలను, జూనియర్ కళాశాల లోనూ, అన్ని ప్రభుత్వ శాఖల గురుకుల పాఠశాలల్లోనూ, కళాశాలల్లోనూ 1 తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న నిరుపేద కుటుంబాలకు చెందిన విద్యార్థుల తల్లులకు లేదా గుర్తింపు పొందిన టువంటి సంరక్షకులకు మత, కుల, ప్రాంత, వివక్ష లేకుండా సంవత్సరానికి 15 వేల చొప్పున ఆర్థిక సహాయం చేయబడును.
అర్హతలు :
✔ కుటుంబ నెలసరి ఆదాయం గ్రామీణ ప్రాంతాలలో పదివేల రూపాయల లోపు మరియు పట్టణ ప్రాంతాలలో 12 వేల రూపాయలు కలిగిన వారు అర్హులు.
✔ తల్లి లేదా సంరక్షకులు ఆధార్ కార్డు మరియు బ్యాంకు అకౌంట్ నెంబర్ ను కలిగి ఉండాలి.
✔ బియ్యం కార్డు లేని కుటుంబాల విషయంలో వారు నిరుపేద అర్హత కలిగి కుటుంబాలకు చెందిన వారు అవునా కాదా అని ఆహారం ద్వారా నిర్ధారించి వారికి కూడా ఇస్తారు.
✔ స్వచ్ఛంద సంస్థ ద్వారా పాఠశాలల్లో మరియు ఇంటర్మీడియట్ కళాశాలలో చదువుతున్న అనాధ పిల్లలకు కూడా ఈ పథకం వర్తింపచేస్తారు.
✔ అర్హత కలిగినటువంటి తల్లులు లేదా సంరక్షకులు వారి పిల్లలకు కనీసం 75 శాతం హాజరు ఉన్నది లేనిదీ కూడా పరిశీలించి ఉంచుకోవాల్సి ఉంటుంది.
✔ కుటుంబం మొత్తాన్ని కలిపి ఐదు ఎకరాల మాగాణి లేదా పది ఎకరాల మెట్ట లేదా మొత్తం కలిపి పది ఎకరాలు మించి ఉండరాదు.
✔ కుటుంబంలో నాలుగు చక్రాల వాహనం కారు ఉండకూడదు ట్రాక్టర్ ఆటో టాక్సీ క్యాబ్ మినహాయింపులు.
✔ కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగి లేదా ప్రభుత్వ పెన్షన్ పొందేవారు ఉండకూడదు.
✔ కుటుంబంలో ఎవరూ కూడా ఆదాయ పన్ను చెల్లించే కూడదు.
✔ నెలసరి ఇంటికి కరెంటు వినియోగం 300 యూనిట్లకు మించకూడదు.
దరఖాస్తు విధానం :
✔ ఈ పథకానికి 1-10 విద్యార్థులు ఏ పాఠశాలల్లో చదువుతుంటే అదే పాఠశాలల్లోని ఉపాధ్యాయులు ప్రతి సంవత్సరం ఈ పథకానికి అప్లై చేయడం జరుగుతుంది.
✔ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు వారి కళాశాలలోనే ప్రతి సంవత్సరం ఈ పథకానికి అప్లై చేయడం జరుగుతుంది.
దరఖాస్తు కు కావలసినవి :
✔ విద్యార్థి ఆధార్ కార్డు
✔ తల్లి ఆధార్ కార్డు మరియు బ్యాంకు అకౌంట్
✔ రేషన్ కార్డ్
0 Post a Comment:
Post a Comment