Saturday 9 January 2021

జగనన్న విద్యా దీవెన మరియు వసతి దీవెన

 జగనన్న విద్యా దీవెన మరియు వసతి దీవెన




ఈ పథకం ముఖ్య ఉద్దేశం : 

రాష్ట్రంలోని పేద విద్యార్థుల ఉన్నత విద్య తమ తల్లిదండ్రులకు భారం కాకూడదని ముఖ్య ఉద్దేశం తో ఈ పథకాన్ని వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించడం జరిగింది. ఈ పథకం ద్వారా పేద విద్యార్థుల తల్లిదండ్రులకు తమ పిల్లలను ఇంటర్మీడియట్ తర్వాత ఉన్నటువంటి ఉన్నత స్థాయి చదువులు చదివించడానికి ఈ పథకం ద్వారా వారికి ప్రతి సంవత్సరం 20 వేల రూపాయల వరకు ఆర్థిక సహాయం చేయడం జరుగుతుంది. జగనన్న విద్యా దీవెన మరియు వసతి దీవెన ద్వారా ఆర్థిక సాయం అందజేయడం జరుగుతుంది.

ఈ పథకం ప్రయోజనాలు :

   ✔ ఈ పథకం ద్వారా పేద విద్యార్థులు ఉన్నత స్థాయి విద్యను చదవడానికి  ఎంతో ఉపయోగపడుతుంది.

   ✔ అర్హత కలిగినటువంటి విద్యార్థులందరికీ జగనన్న విద్య దీవెన అటువంటి పథకం ద్వారా విద్యార్థులకు  కళాశాల ఫీజు మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుంది.

   ✔ అలాగే అర్హత కలిగినటువంటి విద్యార్థులందరూ కూడా విద్యార్థులు ఉన్నత స్థాయి విద్య అభ్యసించే సమయంలో వారికి వసతి మరియు భోజనం ఖర్చుల కోసం సంవత్సరానికి 20 వేల రూపాయల వరకు జగన్ అన్న వసతి దీవెన పథకం ద్వారా విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాలు డబ్బులు జమ చేయడం జరుగుతుంది.

ఈ పథకం ద్వారా డిగ్రీ విద్యార్థులకు 20 వేల రూపాయలు, పాలిటెక్నిక్ కోర్స్ కు 15000, ఐటిఐ కోర్స్ కు పదివేల రూపాయలు వసతి దీవెన కింద ప్రతి సంవత్సరం విద్యార్థుల తల్లి ఖాతాలో వేయడం జరుగుతుంది.

అర్హతలు :

   ✔ ఈ పథకం పొందుటకు కుటుంబ వార్షిక ఆదాయం 2,50,000 రూపాయలు లోపు ఉన్న వారు మాత్రమే అర్హులు.

   ✔ విద్యార్థి తప్పకుండా 75 శాతం పైగా హాజరు శాతం కలిగి ఉండాలి.

   ✔ కుటుంబంలోని సభ్యులందరికీ కలిపి వ్యవసాయ భూమి మాగాని పది ఎకరాల కన్నా తక్కువ లేదా మెట్ట భూమి అయితే 25 ఎకరాల కన్నా తక్కువ లేదా మొత్తం 25 ఎకరాల లోపు ఉన్న వారు అర్హులు.

   ✔ కుటుంబ సభ్యుల లోని ఏ ఒక్కరు కూడా ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండకూడదు. (శానిటరీ వర్కర్లకు మినహాయింపు)

   ✔ కుటుంబంలో  నాలుగు చక్రాల వాహనం (కారు)ఉండకూడదు. (ట్రాక్టర్లు, ఆటోలు, క్యాబ్లు మినహాయింపు )

   ✔ కుటుంబంలో ఎవరైనా ఆదాయ పన్ను చెల్లిస్తున్న మరియు  ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్ పొందుతున్న ఈ పథకానికి అర్హులు కాదు.

   ✔ కుటుంబం మొత్తానికి పట్టణ ప్రాంతంలో 1500 చదరపు అడుగుల కన్నా ఎక్కువ  నివాసస్థలం లేదా ఇళ్ళు ఉండకూడదు.

అప్లై చేయు విధానం :

✔ ఈ పథకానికి విద్యార్థులు ఏ విధంగా అప్లై చేయాలి.


✔ విద్యార్థులకు ఈ పథకం కు తను చదువుతున్న అటువంటి కళాశాలలో జ్ఞానభూమి లేదా నవశకం వెబ్ సైట్ ద్వారా కళాశాల యాజమాన్యం అప్లై చేయడం జరుగుతుంది. 

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top