చదువులతో "ఢీ-ఢీ" - దూరదర్శన్ సప్తగిరిలో వేగంగా వీడియో పాఠాలు
అందుకోలేకపోతున్న విద్యార్థులు
నోట్సు రాసుకోవడానికే సమయం
పిల్లల సందేహాలకు దొరకని పరిష్కారం
✔️ టెలివిజన్ పాఠాలను విద్యార్థులు సంపూర్ణంగా అందుకోలేకపోతున్నారు.
✔️ దూరదర్శన్ (డీడీ) సప్తగిరిఛానల్లో పాఠాలను వేగంగా చెప్పడం వల్ల నోట్సు రాసుకోవడానికే సమయం సరిపోతోంది.
✔️ పాఠాలు వింటున్న సమయంలో వచ్చే సందేహాలను విడిగా నమోదు చేసుకునే అవకాశమే లేకుండా పోతోంది.
✔️ ఒకవేళ నమోదు చేసుకున్నప్పటికీ వాటిపై ఉపాధ్యాయులను ఫోన్లో సంప్రదించేందుకు వీలు కావడం లేదు.
✔️ పేద, మధ్యతరగతి కుటుంబాల్లో ఫోన్లు ఇంటి పెద్ద వద్ద ఉండటం, పనుల రీత్యా ఆయన ఉదయం నుంచి రాత్రి వరకు అందుబాటులో లేకపోవడంతో ప్రశ్న ప్రశ్నలాగే మిగిలిపోతోంది.
✔️ త్వరగా కొరుకుడుపడని ఆంగ్లం, గణితం, భౌతిక శాస్త్రాల విషయంలో సమస్యలు కొనసాగుతూనే ఉన్నాయి.
విద్యాఛానల్ ఏర్పాటు చేస్తే బాగు..
▪ కరోనాతో విద్యా సంస్థలు మూతపడినందున విద్యా వారధి పేరుతో జులై రెండో వారం నుంచి సప్తగిరి ఛానల్ ద్వారా పాఠశాల విద్యాశాఖ పాఠాలను ప్రసారం చేస్తోంది.
▪ ఫోన్లు, అంతర్జాల సమస్యల నేపథ్యంలో అందరికీ సౌకర్యమని భావించి టీవీ పాఠాలను అందిస్తోంది.
▪ ప్రస్తుతం ఇది ఆచరణీయ మార్గమైనప్పటికీ తలెత్తుతున్న సమస్యలు విద్యార్థులను ఇబ్బందుల పాలు చేస్తున్నాయి.
▪ టీవీలో వచ్చే పాఠాలను రాసుకోవాలని ఉపాధ్యాయులు ప్రత్యేకించి చెప్పడంతో పిల్లలు అందుకే ప్రాధాన్యమిస్తున్నారు.
▪ వేగంగా చెప్పే పాఠాలను అర్థం చేసుకోలేకపోతున్నారు.
▪ తరగతి గదిలో ఉపాధ్యాయుడు బోర్డుపై రాసి వెనకబడిన విద్యార్థితో సహా అందరికి అర్థమయ్యే వరకు చెప్పేవారని, వీడియోలో మాత్రం డిస్ప్లే బోర్డుపై బోధిస్తూ తక్కువ సమయం చూపిస్తున్నారని విద్యార్థులు వాపోతున్నారు.
▪బోధన కోసం విద్యాఛానల్ను ఏర్పాటు చేస్తే బాగుంటుందని విద్యావేత్తలు సూచిస్తున్నారు.
▪అందరికీ స్మార్ట్ఫోన్లు లేక పోవడంతో పాఠాలను యూట్యూబ్లోపెట్టినప్పటికీ ఫలితం ఉండటం లేదు.
▪పెద్ద పిల్లలను కొందరు తల్లిదండ్రులు తమతోపాటు పొలానికి తీసుకెళ్తున్నారు.
▪ఇలాంటివారు పాఠాలను చూడటం లేదు.
▪కొన్ని గ్రామాల్లో విద్యుత్ అంతరాయాలుఆటంకమవుతున్నాయి.
పాఠ్యపుస్తకాలూ లేవు..
▪ విద్యార్థులకు ఇంతవరకు పాఠ్యపుస్తకాలు అందలేదు.
▪ విద్యాకానుక కింద వచ్చే నెల 5న వాటిని ఇవ్వనున్నట్లు అధికారులు ప్రకటించారు.
▪ పుస్తకాలు లేకపోవడంతో వీడియో పాఠాల పునశ్చరణకు అవకాశం కరవయింది.
▪ పాఠ్యపుస్తకాలుంటేవిద్యావంతులైన తల్లిదండ్రులు తమ పిల్లలకు వాటిపై అవగాహన కల్పించే అవకాశం ఉండేది.
▪ విద్యార్థుల్లో ఒకరిద్దరు మాత్రమేఫోన్ చేసి సందేహాలను అడుగుతున్నారని పదో తరగతికి ఆంగ్లం బోధించే గుంటూరు ఉపాధ్యాయుడు ఒకరు తెలిపారు.
▪ పిల్లలు ఎలాంటి సందేహాలను అడగడం లేదని కృష్ణా జిల్లాకు చెందిన ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలు వివరించారు.
▪ వారికి పాఠాలు అర్థమవుతున్నాయో, లేదో తెలియడం లేదన్నారు.
▪ వాట్సప్లో వివరాలను పంపించినా తల్లిదండ్రుల వద్ద ఫోన్లు ఉండడంతో పిల్లలు చూడలేకపోతున్నారని వివరించారు.
▪ టీవీ పాఠాలను నోటు పుస్తకంలో రాసుకుంటున్న వారిలో తరగతికి ముగ్గురు, నలుగురు మాత్రమే ఫొటోలు తీసి పంపిస్తున్నారన్నారు.
▪ కొన్నిచోట్ల ఉపాధ్యాయులు ప్రత్యేక ఆసక్తి చూపి వాట్సప్ గ్రూపులను ఏర్పాటుచేసి పాఠ్యాంశాల వీడియోలను పంపిస్తున్నారు.
సాంకేతిక సమస్యలతో ఇబ్బంది :
▪ పాఠాలు ప్రసారమయ్యేసమయానికి ఒక్కోసారి కరెంటు ఉండడం లేదు.
▪ ఏపీ ఫైబర్ కేబుల్ నెట్వర్క్లో సమస్యల వల్ల పాఠ్యాంశం మొత్తం వినడం కుదరడం లేదు.
▪ గణితం, ఆంగ్లంలో కొన్ని అంశాలు అర్థం కావడం లేదు.
జీఎన్వీ ప్రదీప్, పదో తరగతి, జీవీఎంసీ అనకాపల్లి పట్టణం
ఛానల్ రావడం లేదు...?
▪ఆన్లైన్ తరగతులు వినేందుకు సప్తగిరి ఛానల్ రావడం లేదు.
▪ ప్రైవేట్ ఛానల్స్ మధ్యలో దూరదర్శన్ సప్తగిరి ఎక్కడుందో తెలియదు.
▪ దీంతో పాఠాలు వినలేకపోతున్నాం.
▪ పుస్తకాలు లేకపోవడంతో అయోమయంగా ఉంది.
రజాక్ 6వ తరగతి, బేతంచెర్ల, కర్నూలు జిల్లా
ఆసక్తిగా బోధించాలి :
▪ రానున్న రోజుల్లో పాఠశాలలను తెరిచినా పిల్లలను పంపించాలంటే భయమేస్తోంది.
▪ ఈ సమయంలో టీవీ ద్వారా బోధించడం శుభపరిణామం.
▪ ఈ పాఠాల పట్ల పిల్లలు ఆసక్తి చూపేలా ఉపాధ్యాయులు చొరవ చూపాలి.
▪ నీతికథలు, ఛలోక్తులు వేస్తూతరగతి గదిలోనే పాఠ్యాంశాలు వింటున్నామనే భావనను కలగజేయాలి.
▪ ఒకేచోట కూర్చుని బోధించడం వల్ల టీవీలో వార్తలు విన్నట్టు భావిస్తున్నారు.
▪ ముఖ కవళికల్లో మార్పుతో పాటు భావ ప్రకటన స్వేచ్ఛతో బోధిస్తే బాగుంటుంది.
▪ మరిన్ని ఛానళ్లలో కొంతసేపు పాఠాలు ప్రసారం చేయాలి.
0 Post a Comment:
Post a Comment