* ఆంధ్రప్రదేశ్ లో విద్యాలయాలకు అనుమతి
*అన్లాక్-4 మార్గదర్శకాలను విడుదల చేసిన ప్రభుత్వం*
*
.▪ కేంద్రప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఏపీ అన్లాక్-4 మార్గదర్శకాలను విడుదల చేసింది.
🔘 ఈ నెల 21 నుంచి 9, 10, ఇంటర్ విద్యార్థులు విద్యాలయాలకు వెళ్లేందుకు అనుమతినిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది
▪ దీనికోసం తల్లిదండ్రుల రాతపూర్వక అంగీకారం తప్పనిసరి చేసింది.
▪ అంతేకాకుండా అదే రోజునుంచి పీజీ, పీహెచ్డీ విద్యార్థులు కూడా కళాశాలలకు వెళ్లవచ్చని తెలిపింది.
▪ నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు తెరచుకునేందుకు అనుమతినిచ్చింది.
▪ 100 మందికి మించకుండా సామాజిక, విద్య, క్రీడలు, మతపరమైన, రాజకీయ సమావేశాలు నిర్వహించుకోవాలని సూచించింది.
▪ ఈ నెల 20 నుంచి పెళ్లిళ్లకు 50 మందిని, అంత్యక్రియలకు 20 మందికి అనుమతి ఇవ్వాలని నిర్ణయించింది.
▪ 21 నుంచి ఓపెన్ ఎయిర్ థియేటర్లకు అనుమతి ఇచ్చినప్పటికీ సినిమా హాళ్లు, స్విమ్మింగ్పూల్స్, ఎంటర్టైన్మెంట్ పార్కులకు అనుమతి నిరాకరించింది.
0 Post a Comment:
Post a Comment