తెలుగుభాష గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు.
👉 16 17 శతాబ్దాలలో పోర్చుగీసువారు తెలుగువారిని జంతియో అని తెలుగుభాషను జేంతు అని పిలిచేవారు.
👉 ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని తెలుగు భాషను నికోలస్ కాంట్ అన్నాడు.
👉 ఆంధ్రం, తెలుగు ,తెలుగులో ప్రాచీనమైనది ఆంధ్రము.
👉 ఆంధ్ర శబ్దం సంస్కృత పదం. తెలుగు, తెనుగు పదాలు అచ్చ తెలుగు పదాలు.
👉 ఆంధ్రము-తెనుగు- తెలుగు వ్యాసకర్త జి.ఎన్.రెడ్డి.
👉విద్య, హిమాలయాల మధ్య ప్రదేశాన్ని ఆర్యావర్తము అని పుణ్యభూమి అని అమరసింహుడు అమరకోశంలో చెప్పాడు.
👉 ఋగ్వేదంలో ఐతరేయ బ్రాహ్మణంలో ఆంధ్రపదం తొలిసారిగా జాతి వాచకంగా కనిపిస్తుంది.
👉 వాయు, బ్రహ్మాండ, మత్స్య పురాణాలలో ఆంధ్రుల ప్రస్తావన ఉంది.
👉 ఆంధ్రుల గురించి మొదటి సారిగా ప్రస్తావించిన వ్యక్తి మెగస్తనీస్ , ఇండికా గ్రంథం.
👉 అశోకుని 13వ శిలాశాసనం క్రీస్తు పూర్వం మూడవ శతాబ్దంలో ఆంధ్రుల గురించి ప్రస్తావించిన మొదటి శిలాశాసనం.
👉 వరాహమిహిరుడు తన బృహత్సంహిత లో.' కౌశిక విదర్భ వశ్స ఆంధ్ర చేది ' అని ఆంధ్ర దేశాన్ని పేర్కొన్నాడు.
👉 ఆంధ్ర పదం దేశ వాచకంగా కనిపిస్తున్న మొదటి శాసనం మైదవోలు శాసనం.
👉 ఆంధ్రుల నివాసం గురించి మొదటగా బౌద్ధ జాతక కథలలో కనిపిస్తుంది.
👉 నన్నెచోడుని కుమారసంభవంలో ఆంధ్రవిసయం అనే ప్రయోగం కనిపిస్తుంది.
👉 ఆంధ్ర శబ్దం ను భాషా వాచకంగా ఉపయోగించిన తొలి గ్రంథం భరతుని నాట్య శాస్త్రం.
👉 ఆంధ్ర శబ్దం ను భాషా వాచకంగా ప్రయోగించిన తొలి శాసనం నందంపూడి శాసనం.
👉 ఆంధ్ర శబ్దం లో భాషా వాచకంగా ప్రయోగించిన తొలి తెలుగు కవి నన్నయ.(ఆంధ్ర శబ్ద చింతామణి గ్రంథంలో).
👉 పదకొండవ శతాబ్దం నుంచి కవులందరూ ఆంధ్రశబ్దం భాష వాచకంగా ప్రయోగించారు.
త్రిలింగ పదం :
👉 వాయు పురాణం తిలింగ అనే పదం కనబడుతుంది , టాలిమి త్రిలింగం అని పేర్కొన్నాడు, మూడో గళింగం అని ప్లిని పేర్కొన్నాడు.
👉 తెనుంగు పదాన్ని ప్రయోగించిన తొలి కవి నన్నయ.
👉 జానుతెనుగు అనే పదాన్ని పాల్కురికి సోమన బసవపురాణం లో ప్రయోగించాడు.
👉 తెలుగు పదాన్ని భాషా వాచకంగా ప్రయోగించిన తొలి కవి పాల్కురికి సోమన . - పాల్కురికి సోమనాథుడు బసవ పురాణంలో తెలుగు పదాన్ని ప్రయోగించాడు.
నన్నయ _ తెనుంగు ,తెనుగు.
నన్నెచోడుడు_ తెనుంగు.
పాల్కురికి సోమన_ తెనుంగు, తెలుగు .
తిక్కన _ తెనుంగు ,తెనుగు.
👉తెలుగు శబ్దమే ప్రాచీనమైనది దాని నుండి సృష్టించబడినది త్రిలింగ శబ్దం అని పేర్కొన్నది కొమర్రాజు లక్ష్మణరావు.
👉 తెలుగు త్రిలింగ శబ్దం అని తన ఆంధ్ర భాష వికాసంలో పేర్కొన్నది గంటి జోగి సోమయాజి.
👉చిలుకూరి వీరభద్రరావు త్రిలింగ శబ్దం నుంచి ( శ్రీశైలం, ద్రాక్షారామం, కాళేశ్వరం ) మధ్య ఏర్పడిన భాసే తెలుగు భాష అని చెప్పడం జరిగింది.
👉 తెలుగు ప్రాకృత శబ్ద భవము అని భావించింది చిలుకూరి నారాయణరావు (ఆంధ్ర భాషా చరిత్ర).
ఆంధ్ర తొలి గ్రంథాలు :
జాతి వాచకం -ఐతరేయ బ్రాహ్మణం
దేశ వాచకం - వాల్మీకి రామాయణం,
బాషావాచకం - నాట్యశాస్త్రం.
తొలి శాసనాలు :
జాతి వాచకం -13వ శిలాశాసనం,
అశోకుడు.
దేశ వాచకం: మైదవోలు శాసనం, శివ స్కంద వర్మ.
భాషా వాచకం: నందంపూడి శాసనం, నన్నయ.
తెలుగు తొలి గ్రంథాలు :
తెనుగు -ఆంధ్ర మహాభారతం నన్నయ్య.
త్రిలింగ - ప్రతాపరుద్ర యశోభూషణం ,విద్యానాథుడు.
తెలుగు - బసవ పురాణం, పాల్కురికి సోమనాథుడు.
👉 శాసన విషయ నైపుణ్యం కలిగిన తొలి తెలుగు వ్యక్తి -
కావలి బొర్రయ్య.
👉ప్రాచీనాంధ్ర శాసనాలు పై పరిశోధన చేసిన పండితుడు బూదరాజు రాధాకృష్ణ.
👉 శాసనాలను గురించి లిపి పరిమాణాన్ని నిరూపించే శాస్త్రాన్ని ఏపీ గ్రఫీ అంటారు.
ఆంధ్రదేశాన్ని పరిపాలించిన రాజవంశాలు :
శాతవాహనులు, ఇక్ష్వాకులు ,పల్లవులు, బృహత్పలాయనులు, శాలంకాయనులు, ఆనంద గోత్రికులు, విష్ణుకుండినులు ,రేనాటి చోళులు ,తూర్పు చాళుక్యులు, కాకతీయులు, ముసునూరి నాయకులు, రెడ్డిరాజులు, విజయనగర సామ్రాజ్యం.
👉అమరావతి శాసనం లో తొలి తెలుగు పదమైన' నాగబు' పదం ఉంది దీనిని1928 లో వేటూరి ప్రభాకరశాస్త్రి గారు కనుగొన్నారు.
👉 కొత్తూరు మట్టిపాత్ర శాసనం ఎలమంచిలి తాలూకాలోని విశాఖపట్టణంలో గ్రామం లో
' తంబయ ధామం' అనే తొలి తెలుగు పదం అని 2006 లోపత్రికల ద్వార నిరూపించారు.
You may like this post also 👇
0 Post a Comment:
Post a Comment